గిఫ్ట్ ఏ స్మైల్.. వికలాంగులకు 100 బైక్లు అందించనున్న కేటీఆర్..
-కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా వికలాంగులకు చేయిత
– 50 ద్విచక్రవాహనాలు ఇవ్వనున్నట్లు ప్రకటించిన మంత్రి పువ్వాడ..
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆపద్భాందవుడిలా ఆదుకుంటూ.. ఎంతో మందికి అండగా నిలుస్తున్న కేటీఆర్ .. ఇప్పుడు వికలాంగులకు అండగా నిలవబోతున్నారు.
తన పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా.. వంద మంది వికలాంగులకు మూడు చక్రాల ద్విచక్ర వాహనాలను అందించనున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. గతేడాది తన బర్త్డే సందర్భంగా కేటీఆర్ . తన సొంత ఖర్చులతో 6 అంబులెన్స్లను అందించారు. కేటీఆర్ ను స్ఫూర్తిగా తీసుకొని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి 90 అంబులెన్స్లను అందజేశారని ట్వీట్ లో పేర్కొన్నారు.
ముక్కోటి వృక్షార్చనలో పాల్గొనండి
తన బర్త్డే సందర్భంగా ముక్కోటి వృక్షార్చనలో పాల్గొనాలి అని కేటీఆర్ గారు పిలుపునిచ్చారు. లేదా గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా సొంతంగా ఎవరికైనా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పుష్పగుచ్ఛాలు, కేకులు, హోర్డింగ్లపై ఖర్చు పెట్టొద్దని కేటీఆర్ కోరారు.
కేటీఆర్ గారి ట్వీట్ కు స్పంచించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కేటీఆర్ది మంచి నిర్ణయం అని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ తీసుకున్న నిర్ణయం అవసరంలో ఉన్న ఎంతో మంది వికలాంగులకు ఉపయోగకరంగా ఉంటుందని తమకు ప్రేరణగా నిలిచే నాయకుడి అడుగుజాడల్లో నడవడం గర్వంగా ఉందని ట్వీట్ ద్వారా మంత్రి కేటీఆర్ కి బదులిచ్చారు.
కేటీఆర్ బర్త్డే సందర్భంగా తాను కూడా వికలాంగులకు 50 బైక్లను విరాళంగా ఇస్తానని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.