Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టీడీపీ నేత పట్టాభికి బెయిల్ మంజూరు

  • హైకోర్టులో బెయిల్ పిటిషన్ పై విచారణ
  • ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్న పట్టాభి
  • ఇటీవల 14 రోజుల రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు

ఇటీవల సీఎం జగన్ ను దూషించిన కేసులో అరెస్టయిన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభికి బెయిల్ మంజూరైంది. పట్టాభి బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న పిమ్మట పట్టాభికి బెయిల్ ఇస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. పట్టాభి ప్రస్తుతం రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారు.

సీఎంపై అనుచిత వ్యాఖ్యల కేసులో కొన్నిరోజుల కిందట పట్టాభిని అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడ మూడో అదనపు మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ సమయంలోనే ఆయన బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Related posts

రఘురామకృష్ణరాజుకు ఈ నెల 28 వరకు రిమాండ్…

Drukpadam

లండన్‌లో రోడ్డు ప్రమాదం.. నెల రోజులుగా చికిత్స పొందుతున్న తెలుగు యువకుడి మృతి

Ram Narayana

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీబీఐ విచారణ!

Drukpadam

Leave a Comment