Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సాగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ కన్నా జానారెడ్డికి ప్రతిష్టాత్మకం

సాగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ కన్నా జానారెడ్డికి ప్రతిష్టాత్మకం
నాగార్జున సాగర్ ఉపఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా కుందూరు జానారెడ్డిని అధికారికంగా ప్రకటించింది . దీంతో కాంగ్రెస్ లో అభ్యర్థి విషయంలో శషభిషలకు తావులేకుండా చేసింది . ఈ ఎన్నిక కాంగ్రెస్జా కన్నా జానారెడ్డికి ప్రతిష్ఠాత్మకంగా మారింది . ఆయనకు సాగర్ లో మంచి పట్టు ఉంది . గతంలో ఆయన అక్కడ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు . తెలంగాణ మొదటి శాసన సభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు . మాటకు కట్టుబడి, ముక్కుసూటితంగా వ్యవహరించే నాయకుడిగా ఆయనకీ మంచి పేరుంది . అందుకే బీజేపీ పార్టీ నుంచి మంచి ఆఫర్లు ఉన్నా ఆయన కాంగ్రెస్ లోనే ఉండి పోరాడి తన సత్తా చాటాలని అనుకున్నారు . జానారెడ్డి ఈసారి తాను కాకుండా తన కుమారుడిని బరిలో నిలపాలని భావించారు . అయితే రాష్ట్రము లో మారుతున్నా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈసీటు గెలవటం ద్వారా తమ సత్తా చాటాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది . అందుకే జానారెడ్డిని ఒప్పించి మరి బరిలో నిలిపింది . రాష్ట్ర రాజకీయాలలో ప్రత్యేకమైన స్తానం ఉన్న జానారెడ్డి తెలంగాణ ఏర్పాటులో కూడా క్రియాశీలకంగా వ్యవహరించారు . ఇటీవల ఆయన బీజేపీలో చేరబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆయనకు బీజేపీ గవర్నర్ పదవి ఆఫర్ చేశారని , ఆయన కుమారుడైన రఘువీర్ రెడ్డి కి నాగార్జునసాగర్ సీటు ఇస్తామన్నారని వార్తలు వచ్చాయి . అయినప్పటికీ ఆయన వాటిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే తన చర్యల ద్వారా కాంగ్రెస్ తోనే తన ప్రయాణమని చెప్పకనే చెప్పారు . ఆయన పోటీలో ఉంటె టీ ఆర్ యస్ ,బీజేపీ లు పోటీలో ఉన్న జానారెడ్డినే వారికీ బలమైన అభ్యర్థి గా ఉంటారని పరిశీలకుల అభిప్రాయం . ఆయనకు ప్రజలతో మంచి సంభందాలు ఉండటంతో ఈ సరి పోటీ రసవత్తరంగా ఉండే ఆవకాశం ఉంది . కాంగ్రెస్ పార్టీ , టీపీసీసీ చీఫ్ ఎంపిక కూడా వాయిదా వేసిన నేపథ్యం లో ఇక కొద్దీ కాలం పాటు విరామం ఇంచినట్లు అయింది . కాంగ్రెస్ నేతలంతా నాగార్జున సాగర్ బాట పట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది . రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ సాగర్ ఎన్నికలలో రాష్ట్ర నాయకులను ఏకతాటిపై నడిపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం . సాగర్ లో గెలుపు రాష్ట్ర రాజకీయాలలో మలుపు కానున్నదని కాంగ్రెస్ నేతల విశ్వాసం . టీ ఆర్ యస్ పై ప్రజల భ్రమలు తొలిగిపోయాని అందుకే దుబ్బాకలోను , గ్రేటర్ ఎన్నికలలోను టీ ఆర్ యస్ ను ప్రజలు తిరస్కరించారని అయితే అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా బీజేపీకి అడ్వాంటేజ్ అయిందని , కానీ రాష్ట్రము లో బీజేపీ ప్రభావం వారు అనుకున్నంత ఉండకపోవచ్చునని కాంగ్రెస్ నేతల అభిప్రాయంగా ఉంది . బీజేపీ కూడా సాగర్ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకొంటుంది . సమర్థమైన అభ్యర్థి అన్వేషణలో ఆపార్టీ ఉంది . కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఆర్ధిక బలం పుష్కలంగా ఉంది. రాష్ట్రము లో అధికారంలో ఉన్న టీ ఆర్ యస్ తమ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆకాల మరణము చెందినందున తిరిగి తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని పట్టుదలతో ఉంది . ఒకవేళ ఇక్కడ టీ ఆర్ యస్ ఓడిపోతే ఇబ్బందులు తప్పవనే ఆలోచనతో ఉన్న టీ ఆర్ యస్ సీటు నిలబెట్టుకునేందుకు సర్వ శక్తులు వడ్డే ఆవకాశం ఉంది . దీంతో సాగర్ ఉపఎన్నిక జానారెడ్డి రాజకీయ భవిషత్ తోపాటు రాష్ట్ర రాజకీయాలలో కీలక మలుపు కానున్నదనటంలో ఎలాంటి సందేహం అక్కరలేదు .

Related posts

ఖబడ్దార్ కేసీఆర్.. నీ ఆటలు ఇక సాగవు: షర్మిల

Drukpadam

తనదృష్టిలో పీసీసీ పదవి చిన్నవిషయం అంటున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి!

Drukpadam

సీఎం కేసీఆర్ దళిత బాట …ప్రగతి భవన్ లో అఖిలపక్షం దళితులకు ఏటా 10 వేల కోట్లు…

Drukpadam

Leave a Comment