Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగులు కేసీఆర్ మాయమాటలు నమ్మకండి-రాములునాయక్

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి రాములునాయక్

కాంగ్రెస్ఎమ్మెల్సీ రాములు నాయక్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతు మరోసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యోగసంఘాల నాయకులను పిలిచి ఫిట్మెంట్ ఇస్తానని అన్నారు..అది కూడా ఎన్నికల కోడ్ అమలులో టైం లో ప్రభుత్వ ఉద్యోగులు ఏమాత్రం నమ్మకండి..ఎన్నికల సమయంలో ఎదో ఒక వాగ్దానం చేస్తూ మోసం చేస్తూ ఉన్నాడు… ధనిక రాష్ట్రాన్ని దారిద్ర్య రాష్ట్రం గా మార్చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రి కే చెందుతుంది..రెండు డీ ఏ లు బకాయిలు ఉన్నాయి..7.5%ఫిట్మెంట్ ఇవ్వలేని వాళ్ళు 29%ఇస్తానని అనడం హాస్యాస్పదంగా ఉంది..అబద్ధాలు ముఖ్యమంత్రి గా పెరుగాంచారు.పట్టభద్రులరా ఒక్కసారి ఆలోచించండి..ఇలాంటి మోసపూరిత మాటలు చెప్పే ప్రభుత్వాన్ని నమ్మకండి..కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి శాసనమండలికి పంపించండి.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ముఖ్యమంత్రి పై కేస్ పెట్టాలి..ఎన్నికల కమిషన్ కి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే కేస్ పెట్టి విచారణ చేయాలి..టీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి ఎన్ని డబ్బులు పంచిన ఎన్ని అసత్యప్రచారం చేసిన ఈ సారి గెలిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ.. నిరుద్యోగ భృతి ఏమైంది.. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఈ టీ ఆర్ ఎస్ ప్రభుత్వం మరి కొన్నిరోజుల గడిస్తే తాకట్టు పెట్టడానికి కూడా ఏమి మిగలదు అని ఎద్దేవాచేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఖమ్మం నగర వర్కింగ్ ప్రెసిడెంట్ కార్పొరేటర్ నాగళ్ళ దీపక్ చౌదరి, శ్రీనివాస్ రెడ్డి, రహెమాన్, రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు

Related posts

కెనడాలో ప్రాణాంతక ‘జాంబీ’ వ్యాధి.. వ్యాక్సిన్లు, చికత్సల్లేవ్!

Drukpadam

తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తోంది: గవర్నర్ తమిళిసై!

Drukpadam

మాట…మర్మం

Drukpadam

Leave a Comment