Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబుకు జలక్ ఏపి సిఐడి నోటీసులు

అమరావతి భూముల వ్యవహారంలో విచారణకు హాజరు కావాలని ఆదేశం

-మాజీ మున్సిపల్ పట్టణాభివృద్దిశాఖమంత్రి నారాయణకు సైతం నోటీసులు

-కంగుతిన్న టీడీపీ వర్గాలు

అమరావతి భూములు అమ్మకాలు కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ గతంలోనే చంద్రబాబు నాయుడు పై అనేక ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అందులో భాగంగా ఈరోజు హైదరాబాదులో చంద్రబాబు నివాసానికి ఏపి సిఐడి అధికారులు వెళ్లి 41 సిఆర్ పి సి కింద నోటీసులు జారీ చేశారు. మాజీ మంత్రి నారాయణ కు సైతం సిఐడి అధికారులు నోటీసులు అందజేశారు.
ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని, 40 వేలు విలువచేసే గజం భూమిని కొందరు మంత్రుల బంధువులకు, కుటుంబ సభ్యులకు కేవలం 14 వందలకే అమ్మకాలు చేశారని , వీటిపై విచారణకు హాజరు కావాలని సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు.
అమరావతి రాష్ట్ర రాజధాని కాబోతుందని ముందుగానే నిర్ణయుంచి ఆ సమాచారాన్ని సహచరులకు సన్నిహితులకు చేరవేసి వేలాది ఎకరాలు సేకరించి వారు కొనుగోలు చేసేలా చేశారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూములు తక్కువ ధరకు అమ్మడం, విలువైన ప్రైవేటు భూములను రాజధాని పేరుతో తక్కువ ధరకు సేకరించడం, వాటిని తిరిగి బంధుగణం కు దక్కేలా చేయడం వంటివి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు గా సిఐడి వర్గాలు ప్రాధమిక విచారణలో తెలింది .దీనిపై అసెంబ్లీలో కూడ పెద్ద దుమారం లేచింది.
అమరావతి భూముల వ్యవహారం ఎపి రాజకీయాలలో హట్ గా మారింది.మరికొంత మందిపై విచారణ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది

Related posts

రాజకీయ లబ్ది కోసమే జెడి లక్ష్మీనారాయణ పిటిషన్ :కేంద్రం కౌంటర్ అఫిడవిట్!

Drukpadam

ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ముస్లిం మహిళ.. ఫత్వా జారీ!

Drukpadam

విద్యుత్ సైకిళ్ల శ్రేణిలో మరో రెండు మోడళ్లు తీసుకువచ్చిన ‘హీరో’

Drukpadam

Leave a Comment