Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

53 ప్రత్యేక మేజిస్ట్రేట్ కోర్టులను రద్దు- తెలంగాణ హైకోర్టు

  • హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 10 ఏళ్ల క్రితం కోర్టుల ఏర్పాటు
  • ఇటీవలే 15 శాశ్వత న్యాయస్థానాలు మంజూరు
  • దీంతో ప్రత్యేక కోర్టులను రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ
TS High Court cancels special magistrate courts

తెలంగాణలోని ప్రత్యేక మేజిస్ట్రేట్ కోర్టులను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపింది. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్న 53 ప్రత్యేక కోర్టులు రద్దు కానున్నాయి. 10 ఏళ్ల క్రితం ఈ కోర్టులు ఏర్పాటయ్యాయి. చెక్ బౌన్స్ వివాదాలు, రెండేళ్లలోపు శిక్ష ఉండే కేసులను విచారించేందుకు ఈ కోర్టులను ఏర్పాటు చేశారు.

అయితే, రెండు జిల్లాలకు ఇటీవలే 15 శాశ్వత న్యాయస్థానాలు మంజూరయ్యాయి. దీంతో, ప్రత్యేక కోర్టులను హైకోర్టు రద్దు చేసింది. వీటిలో పని చేస్తున్న ఒప్పంద ఉద్యోగుల సేవలను ఇతర న్యాయస్థానాల్లో తాత్కాలిక ప్రతిపాదికన వినియోగించుకోవాలని ఉత్తర్వుల్లో హైకోర్టు పేర్కొంది.

Related posts

నెంబర్ వన్ స్థానంలో జపాన్ పాస్ పోర్ట్ …87 వ స్థానంలో ఇండియా …!

Drukpadam

పేపర్ లీక్ వెనక బండి సంజయ్ కుట్ర.. తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆరోపణలు

Drukpadam

ఏపీ సహా ఐదు రాష్ట్రాల అప్పులపై ‘ది ప్రింట్’ సంచలనాత్మక కథనం..

Drukpadam

Leave a Comment