Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అప్పుల రాష్ట్రంగా తెలంగాణ…సీఎల్పీ నేత భట్టి ధ్వజం

గన్ పార్కవద్ద మీడియాతో మాట్లాడుతున్న సీఎల్పీ నేత భట్టి

అప్పుల రాష్ట్రంగా తెలంగాణ… సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
శాసనసభ సమావేశాలు జరిగిన తీరు జుగుస్సాకరం
– అలంకారప్రాయంగా సమావేశాలు
-30 రోజులు జరగాల్సిన సమావేశాలు కేవలం ఆరు రోజులేనా?
-చర్చల్లో అవకాశం లేకుండా నిరంకుశంగా వ్యవహరించింది.
-ప్రతిపక్ష గొంతు నొక్కి మాట్లాడనివ్వలేదు
-ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి కి విరుద్ధం
-ఈ ఏడాది అప్పులు రూ 50 వేల కోట్లు
– 2023-24కల్లా ఐదు నుంచి ఆరు లక్షల కోట్లకు చేరే అవకాశం
-పక్కదారి పడుతున్న సబ్ ప్లాన్ నిధులు
బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరు జుగుస్సాకరం ….సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నిరంకుశంగా వ్యవహరించటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం…. .ప్రతిపక్షాన్ని ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ సభ్యులను మాట్లాడనివ్వలేదు….. అయినప్పటికీ దొరికిన కొద్దీ ఆవకాశం వినియోగించుకొని అనేక ప్రజాసమస్యలను తమ పార్టీ సభ్యులు శ్రీధర్ బాబు ,రాజగోపాల్ రెడ్డి, సీతక్క , జగ్గారెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారని శాసనసభ సమావేశాలపై తీరుపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. సమావేశాలు ముగిసిన అనంతరం గాన్ పార్క్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

దాదాపు 30 రోజులు జరగాల్సిన బడ్జెట్ సమావేశాలను కేవలం ఆరు రొజుల్లోనే ముగించడంపై సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020-21 ఏడాదికి సంబంధించిన 2 లక్షల 30 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన భారీ బడ్జెట్ ను కేవలం ఆరు రోజులకు మాత్రమే చర్చలను పరిమితం చేసి.. పాస్ చేయించుకుని వెళ్లిన వైనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపైనా, కేసీఆర్ పైనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దాదాపు 30 రోజులు నడవాల్సిన బడ్జెట్ సమావేశాలను ఆరు రోజులకే పరిమితం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి భారీ బడ్జెట్ పైనా సుదీర్ఘంగా చర్చలు జరిపి.. పాస్ చేసుకోవాల్సి ఉండగా, కేవలం ఆరు రోజుల్లోనే సమావేశాలు పూర్తి చేయడంపై భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆరు రోజుల్లోకూడా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని భట్టి విమర్శించారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సూచనలను అధికార పక్షం ఏ మాత్రం పట్టించుకోలేదని భట్టి అన్నారు. బడ్జెట్ ను అధికార పక్షం పాస్ చేయించుకున్న వైనం.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని భట్టి అన్నారు. కేసీఆర్ పాలన నియంత్రుత్వ పాలనలా ఉంది తప్ప ప్రజాస్వామ్య పాలనలా లేదని అన్నారు. శాసనసభా సమావేశాలు కేవలం అలంకార ప్రాయంగా మారిపోయాయి తప్ప… అర్థవంతమైన చర్చలు జరగడం లేదని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ రంగం, నీటిపారుదల, కృష్ణ నది మీద ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల గురించి సభలో ప్రభుత్వం ద్రుష్టికి తీసుకువచ్చామని భట్టి చెప్పారు. ఏపీ ప్రభుత్వ నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆపడంలో తెలంగాణ సర్కార్ పూర్తిగా విఫలమైందని భట్టి ఆరోపించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను రీ డిజైన్ పేరుతో టెండర్లలో అక్రమాలకు పాల్పడి.. భారీ అవినీతికి పాల్పడినట్లు భట్టి ఆరోపించారు. ఇది రాష్ట్రం మీద అదనపు ఆర్థిక భారంలా మారిందని బట్టి అన్నారు. ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్ ప్రజల సమక్షంలో పెట్టడంతో పాటు చట్టసభలలో పెట్టాలని భట్టి డిమాండ్ చేశారు. డీపీఆర్ లను చట్టసభల్లో ఇవ్వకపోవడంతో ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అనేక అవకతవకలు జరిగినట్లు అనుమానాలున్నాయని భట్టి అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడవడం లేదన్నారు. అప్పులను ప్రభుత్వం విపరీతంగా చేస్తోందన్నారు. ఈ ఏడాది రూ. 48 వేల నుంచి రూ. 50 వేల కోట్ల వరకూ అప్పులు ప్రభుత్వం తీసుకువస్తోందని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా.. చిరవకు రాష్ట్రాన్ని డెడ్ ట్రాప్ లోకి నెట్టేస్తున్నారని భట్టి ఆగ్రహంగా వ్యక్తం చేశారు.రాష్ట్ర అప్పులు 2023 నాటికల్లా ఐదున్నర నుంచి 6 లక్షల కోట్ల రూపాయాలకు చేరుకుంటాయని హెచ్చరించారు. రాష్ట్రాన్ని కుదవపెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు . ఇది చాలా ప్రమాదకరమని మండి పడ్డారు . ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద కేటామయించిన నిధులను వినియోగించకుండా.. వాటిని ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయితీ కార్యదర్శుల అంశాలపై కాంగ్రెస్ శాసనసబా పక్షం సభలో అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం నేరుగా సమాధానం ఇవ్వలేదని అన్నారు. సభలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకే డిక్కిలేదని ప్రభుత్వ విధానాలను తూర్పార బట్టారు. భట్టి తో పాటు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో సమావేశంలో పాల్గొన్నారు.

Related posts

ధరణి భూసమస్యలపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. పరిష్కారానికి 15నుండి రెవెన్యూ సదస్సులు

Drukpadam

హుజూరాబాద్‌లో లొల్లిలొల్లి..

Drukpadam

కోమటిరెడ్డిని సొంత అన్నగా భావించా.. ఆయన వైఖరి బాధిస్తోంది: పాల్వాయి స్రవంతి

Drukpadam

Leave a Comment