Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కరోనా ఎఫెక్ట్‌… షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేత

కరోనా ఎఫెక్ట్‌… షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేత

 

  • మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా విజృంభణ
  • కట్టడి కోసం కఠిన ఆంక్షలు
  • నేటి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమల్లోకి
  • ప్రభుత్వ నోటిఫికేషన్‌ మేరకే ఆలయం మూసివేత
  • తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు భక్తులకు నో ఎంట్రీ
Corona effect shirdi temple will be closed

మహారాష్ట్రలో కరోనా భారీ స్థాయిలో వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రముఖ షిర్డీ సాయిబాబా ఆలయాన్ని మూసివేయనున్నారు. కొవిడ్‌ కట్టడి కోసం కఠిన ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్‌ వెల్లడించింది.

సోమవారం సాయంత్రం 8 గంటల నుంచి తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆలయం మూసివేయనున్నట్లు ట్రస్ట్‌ తెలిపింది. అయితే, ఆలయంలో రోజువారీ పూజాకార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని ట్రస్ట్‌ ప్రతినిధి రవీంద్ర థాకరే  వెల్లడించారు. అయితే, భక్తుల్ని మాత్రం అనుమతించబోమని స్పష్టం చేశారు.

మహారాష్ట్రలో రోజువారీ కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్న విషయం తెలిసిందే. దీంతో మహమ్మారి కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే నేటి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమల్లోకి తెచ్చింది. అలాగే వారాంతంలో లాక్‌డౌన్‌ విధించనుంది.

 

Related posts

బాక్సింగ్ లో భారత్​ కు కాంస్య పతకం సాధించిన లవ్లీనా..అభినందనల వర్షం!

Drukpadam

ఆసక్తిక‌ర స‌న్నివేశం!.. బాలినేని వెంట జ‌గ‌న్ వ‌ద్ద‌కు క‌ర‌ణం బ‌ల‌రాం!

Drukpadam

నేను మళ్లీ పుట్టాను.. గత జన్మ విషయాలను పూసగుచ్చినట్టు వివరిస్తున్న నాలుగేళ్ల బాలిక!

Drukpadam

Leave a Comment