Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నామాలా లేక రాష్ట్రానికి పంగనామాలా …సునీల్ దేవధర్ పై పేర్ని నాని వ్యంగ్యం

నామాలా లేక రాష్ట్రానికి పంగనామాలా …సునీల్ దేవధర్ పై పేర్ని నాని వ్యంగ్యం
-ఏనాడూ బొట్టు పెట్టుకోని వ్యక్తి.. తిరుపతి ఎన్నికల కోసం నామాలు పెట్టుకుంటున్నారు
-సునీల్ దేవధర్ కు, యం.ధర్మరాజు సినిమాలోని పాత్రకు తేడా లేదు
-జె పి నడ్డా ఏమి చెబుతారని విమర్శ
-తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హోదా పై ఏమి చెబుతారు
-చంద్రబాబు తండ్రిగా కూడా విఫలమయ్యారు
-టీడీపీలో అందరూ జూనియర్ ఎన్టీఆర్ రావాలని కోరుకుంటున్నారు
-తిరుపతి ఉపఎన్నిక మా పాలనకు కచ్చితంగా రెఫరండమే
ఏపీ బీజేపీ ఇన్చార్జి సునీల్ దేవధర్ కు యం.ధర్మరాజు ఎంఏ సినిమాలో పాత్రకు ఎలాంటి తేడా లేదని అన్నారు. సునీల్ దేవధర్ పెట్టుకున్నది నామాలా? లేక రాష్ట్రానికి పెట్టబోయే పంగనామాలా? అని ప్రశ్నించారు. గతంలో ఏనాడూ బొట్టు పెట్టుకోని సునీల్ దేవధర్… తిరుపతి ఎన్నికల కోసం నామాలు పెట్టుకుంటున్నారని విమర్శించారు. తిరుపతి ప్రచారానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వచ్చి ఏం చెపుతారని పేర్ని నాని ప్రశ్నించారు. హోదా ఇచ్చామని చెబుతారా లేక విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రవేటీకరణ చేయబోమని చెబుతారా ? విభజన చట్టంలోని హామీలు అమలు చేశామని చెబుతారా ?ఏమి చెబుతారని ప్రశ్నించారు. ఏనాడూ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించని బీజేపీ నేతలు… ఇప్పుడు మతం కార్డును వాడుకుని లబ్ధి పొందాలనుకుంటున్నారని పేర్ని నాని మండిపడ్డారు. మత విద్వేషాలను అజెండాగా తీసుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు.

ఒక తండ్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు విఫలమయ్యారని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆయన కుమారుడు నారా లోకేశ్ కు రాజకీయాలనే కాకుండా, కనీస సంస్కారాన్ని కూడా నేర్పించలేకపోయారని విమర్శించారు. టీడీపీలో సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి నుంచి చిన్న కార్యకర్త వరకు జూనియర్ ఎన్టీఆర్ రావాలని అంటున్నారని చెప్పారు. తిరుపతి ప్రజలు కరోనా బారిన పడినా పర్వాలేదు అనే విధంగా చంద్రబాబు, లోకేశ్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్ రాజకీయ స్వార్థాన్ని కూడా పక్కనపెట్టి తిరుపతి ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. తిరుపతి ఉప ఎన్నిక వైసీపీ 22 నెలల పాలనకు రెఫరెండం అని అన్నారు.

Related posts

రాజశేఖర్ రెడ్డిని తిడితే చెంప చెళ్లుమనిపిస్తాం …తెలంగాణ మంత్రులకు రేవంత్ వార్నింగ్…

Drukpadam

రూట్ మార్చి సైకిల్ ఎక్కిన సీఎల్పీ నేత భట్టి

Drukpadam

మేం కనీసం 141 సీట్లు గెలవడం ఖాయం: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్!

Drukpadam

Leave a Comment