Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ పై మరోసారి విమర్శలు గుప్పించిన వైయస్ షర్మిల

కేసీఆర్ పై మరోసారి విమర్శలు గుప్పించిన వైయస్ షర్మిల
-దళితులను కేసీఆర్ మోసం చేశారు
-కాళేశ్వరం ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరును ఎందుకు పెట్టలేదు?
-అంబేద్కర్ జయంతిని నిర్వహించడానికి కరోనా నిబంధనలు అడ్డు వచ్చాయా?
-దళిత ముఖ్యమంత్రిని ఎందుకు చేయలేదు
-మూడెకరాల భూమి ఏమైంది కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైయస్ షర్మిల మరోసారి విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. తెలంగాణ వస్తే దళిత వ్యక్తిని తొలి సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్… ఆ తర్వాత దళితులను మోసం చేశారని విమర్శించారు. దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూమి ఏమైందో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. దళితులను ఓట్లు బ్యాంకు గానే చూస్తున్నారని విమర్శించారు . అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను లోటస్ పాండ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దళిత సామాజికవర్గానికి చెందిన డిప్యూటీ సీఎం రాజయ్యపై ఒక్క ఆరోపణ వచ్చిన వెంటనే ఆయనను కేసీఆర్ పదవి నుంచి తొలగించారని షర్మిల అన్నారు. మంత్రి మల్లారెడ్డిపై ఎన్నో ఆరోపణలు వస్తున్నప్పటికీ కేసీఆర్ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారానికి అడ్డురాని కోవిడ్ నిబంధనలు… అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించడానికి మాత్రం అడ్డు వచ్చాయా? అని దుయ్యబట్టారు. చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరును వైయస్ రాజశేఖరరెడ్డి పెట్టారని… కాళేశ్వరం ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరును కేసీఆర్ ఎందుకు పెట్టలేకపోయారని ప్రశ్నించారు. నిరంతరం ప్రజలను మోసం చేయటం కేసీఆర్ కు తెలిసినంతగా మరెవరికి తెలియదని ధ్వజమెత్తారు. . మరోవైపు, రేపు షర్మిల నిరాహారదీక్షను చేపట్టబోతున్న సంగతి తెలిసిందే.

Related posts

కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి.. గవర్నర్ ఆమోదం…

Drukpadam

‘రైతుల కోసం తెలుగుదేశం’ కార్యాచరణ ప్రకటించిన చంద్రబాబు…

Drukpadam

జగన్ సబ్జెక్టు లేని సీఎం… మూడు రాజధానులు అంటూ కాలక్షేపం : లోకేష్

Drukpadam

Leave a Comment