Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

దటీజ్ ముంబై… ఓడిపోతుందని అనుకున్న మ్యాచ్ గెలవడం

దటీజ్ ముంబై… ఓడిపోతుందని అనుకున్న మ్యాచ్ గెలవడం
మరోమారు స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని సన్ రైజర్స్ పై విజయం!
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ముంబై
కేవలం 150 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ సేన
ఛేదించలేకపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్
బెయిర్ శుభారంభం వృథా
దటీస్ ముంబై ……. మ్యాచ్ ఓడిపోతుందని అందరు అనుకున్నారు. అయినా క్రికెట్ కదా ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు . కోల్ కత్తా తో జరిగిన మ్యాచ్ లోను ఇదే తీరు ముంబై గెలవడం కష్టం అనుకున్నారు. మొత్తం మ్యాచ్ కోల్ కత్తా చేటోల్లోకి పోయింది. ఆదశలో రాహాల్ చాహర్ అనే స్పిన్ బౌలర్ తన మాయాజాలం తో టపటప వికెట్లను పడగొట్టాడు ఇంకేముంది.గెలుపు సంబరాలు చేసుకుందామని అనుకున్న కోల్ కత్తా ఆటగాళ్లకు టీమ్ యాజమాన్యానికి షాక్ టీం ఓడిపోయింది. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో సైతం స్వల్ప టార్గట్ కేవలం 150 పరుగులు . లక్ష్య సాధనలో కెప్టెన్ డేవిడ్ వార్నర్ తో కలిసి ఇన్నింగ్ ఆరంభించిన బెయిర్ స్టో దూకుడు ముందు ముంబై బౌలర్లు బిత్తర పోయారు. ఫోర్ లు ,సిక్సర్లతో చెలరేగాడు . లక్ష్యం చిన్నది కావడం తో మొత్తం అన్ని ఓవర్లు ఆడాల్సి అవసరం ఉండక పోవచ్చు అని క్రీడాపండితులు భావించారు. కాని బెయిర్ స్టో అవుట్ అయినా తరువాత అంతా మారిపోయింది ముంబై గెలిచింది.
లక్ష్యం కేవలం 151 పరుగులు. బెయిర్ స్టో శుభారంభం ఇచ్చాడు కూడా. ఓ దశలో 76 బంతుల్లో చేయాల్సిన పరుగులు 84 మాత్రమే. అయినప్పటికీ, సన్ రైజర్స్ జట్టు 20 ఓవర్లు కూడా ఆడలేక 13 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ పై ఓడిపోయి హ్యాట్రిక్ పరాజయాన్ని మూటగట్టుకుంది. అంతకుముందు ప్రస్తుత ఐపీఎల్ లో తొలిసారిగా టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ను ఎంచుకుంది. ఈ పిచ్ ని ముందుగానే క్షుణ్ణంగా పరిశీలించిన ఎంఐ కెప్టెన్ రోహిత్ శర్మ, రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ క్లిష్టతరమవుతుందని గమనించి ఈ నిర్ణయం తీసుకున్నాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఆపై 151 పరుగులు లక్ష్యంగా బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 19.4 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. రాహుల్ చాహార్ 3 వికెట్లు, ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు తీసి తమ జట్టు విజయానికి బాటలు వేశారు. బెయిర్ స్టో 22 బంతుల్లో 43 పరుగులు, కెప్టెన్ వార్నర్ 34 బంతుల్లో 36, విజయ్ శంకర్ 25 బంతుల్లో 28 పరుగులు చేశారు. మరే ఆటగాడు కూడా రెండంకెల పరుగులను చేరలేకపోయారు. మనీశ్ పాండే 2, విరాట్ సింగ్ 11, శంకర్ 28, అభిషేక్ 7, రషీద్ ఖాన్ 0, భువనేశ్వర్ 1, ఖలీల్ అహ్మద్ 1 పరుగు చేసి అవుట్ అయ్యారు. సన్ రైజర్స్ చివరి 7 వికెట్లూ 36 పరుగుల తేడాలోనే కోల్పోవడం గమనార్హం.

ఇక నేడు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. రాయల్ చాలెంజర్స్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మధ్యాహ్నం మ్యాచ్ జరుగనుండగా, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య రాత్రి 6.30 నుంచి మ్యాచ్ జరుగనుంది.

Related posts

మాల్దీవుల్లో ఓ బార్లో డేవిడ్ వార్నర్, మైకేల్ స్లేటర్ డిష్యుం డిష్యుం! గాలి వార్తే

Drukpadam

నన్ను కెప్టెన్ గా నియమిస్తారనుకున్నాను… మనసులో మాట బయటపెట్టిన యువరాజ్ సింగ్…

Drukpadam

ఆఫ్ఘనిస్థాన్ తో సిరీస్ కు టీమిండియా ఎంపిక… 14 నెలల తర్వాత టీ20 జట్టులోకి రోహిత్ శర్మ

Ram Narayana

Leave a Comment