Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

కరోనా కట్టడికి గులేరియా సూచనలు

కరోనా కట్టడికి గులేరియా సూచనలు
కరోనా వ్యాప్తికి కంటోన్మెంట్ జోన్ల ఏర్పాటుతోనే అడ్డుకట్ట
-ప్రజలు గుమిగూడకుండా చర్యలు
వ్యాక్సినేషన్ వేగవంతం

దేశాన్ని మళ్లీ జోన్లుగా విభజించాలి
దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు ఢిల్లీ ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ గులేరియా మూడు కీలక సూచనలు చేశారు. కంటైన్‌మెంట్‌ జోన్ల ఏర్పాటు, ప్రజలు గుమికూడకుండా అడ్డుకోవడం, వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయడం వంటి చర్యల ద్వారా మహమ్మారిని అదుపులోకి తీసుకురావొచ్చని ఎన్డీటీవీ నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వేరియంట్లు విజృంభిస్తున్న తరుణంలో మనం మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిందని గులేరియా అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేలా కంటైన్‌మెంట్‌ జోన్లు ఏర్పాటు చేసి టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్‌మెంట్‌ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. గతంలో విభజించినట్లుగా కరోనా తీవ్రతను బట్టి రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లుగా విభజించాలని తెలిపారు. అలాగే ఆసుపత్రుల్లో మరిన్ని పడకలు, ఆక్సిజన్‌ పాయింట్లు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

100 ఏళ్ల క్రితం వచ్చిన మహమ్మారులను పరిశీలించినట్లయితే.. రెండో దఫా విజృంభణ అత్యంత ప్రమాదకరంగా ఉండిందని గుర్తుచేశారు. ఇప్పటికీ ప్రజలు అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. బయట విచ్చలవిడిగా తిరుగుతున్నారని అందుకే కేసులు పెరుగుతున్నాయని తెలిపారు.

ఇక యాంటీవైరల్‌ డ్రగ్‌ రెమ్‌డెసివిర్‌ విషయానికి వస్తే… కొవిడ్‌-19 చికిత్సలో దీని పాత్ర పరిమితమేనని తెలిపారు. ఇది కేవలం ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్యను తగ్గించవచ్చు కానీ, మరణాల రేటును మాత్రం తగ్గించలేదని తెలిపారు. ఇప్పటి వరకు కరోనాకు సమర్థమైన చికిత్స, ఔషధం లేదని తేల్చి చెప్పారు.

కరోనా కట్టడి ఆంక్షలు వ్యాక్సినేషన్‌కు అడ్డుకాకూడదు: కేంద్రం
రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసిన కేంద్రం
ఆంక్షల వల్ల టీకా కార్యక్రమానికి అంతరాయం కలగొద్దని ఆదేశం
లబ్ధిదారులు టీకా కేంద్రాలకు చేరేలా చర్యలు చేపట్టాలి
టీకాలిస్తున్న కొవిడ్‌ ఆస్పత్రుల్లోనూ వ్యాక్సినేషన్‌
అయితే, వేర్వేరు భవనాల్లో నిర్వహించాలని సూచన
కరోనా కట్టడి కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విధించిన ఆంక్షలు వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి అడ్డుగా మారొద్దని కేంద్రం స్పష్టం చేసింది. ఆంక్షల వల్ల వ్యాక్సినేషన్‌కు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖ రాసింది. లబ్ధిదారులు టీకా కేంద్రాలకు చేరకుండా ప్రయాణాలపై విధించిన ఆంక్షలు అడ్డుపడొద్దని స్పష్టం చేసింది.
అలాగే టీకా కేంద్రాలుగా గుర్తించిన కొవిడ్‌ ఆస్పత్రులు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించాలని కేంద్రం తెలిపింది. అయితే, కొవిడ్‌ చికిత్స, వ్యాక్సినేషన్‌ వేరువేరు భవనాల్లో నిర్వహించాలని స్పష్టం చేసింది. దీంతో టీకా వేయించుకోవడానికి వచ్చిన వారు.. కరోనా సోకిన వారు కలిసే అవకాశం ఉండదని వివరించింది.

అవసరం లేకపోయినా ఆక్సిజన్ కోసం వైద్యులపై ఒత్తిడి చేయడం సరికాదు: ఈటల
కరోనా ఉద్ధృతిపై ఈటల సమీక్ష
రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని వెల్లడి
రోగుల ఆందోళనను బట్టి వైద్యం చేయొద్దని డాక్టర్లకు సూచన
రోజుకు 260 టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతోందని వివరణ
తెలంగాణలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి తెలంగాణలో ఆక్సిజన్ కొరత లేదని వెల్లడించారు. అయితే, కొందరు రోగులు అవసరం లేకపోయినా ఆక్సిజన్ కోసం వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారని, ఇది సరైన ధోరణి కాదని స్పష్టం చేశారు. రోగి ఆందోళనను బట్టి చికిత్స చేయవద్దని, రోగికి ఏది అవసరమో గుర్తించి దాని ప్రకారమే చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.

Related posts

లాక్ డౌన్ దిశగా భారత్ …న్యూ ఇయర్ వేడుకలు లేనట్లే…?

Drukpadam

ప్రతిపక్షాల లేఖ పై బీజేపీ మండిపాటు…

Drukpadam

హ‌రీశ్ రావు చేసిన విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టిన కిష‌న్ రెడ్డి

Drukpadam

Leave a Comment