Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కరోనా నిబంధనల మధ్య భధ్రాద్రి రాముని కళ్యాణం..

-పాల్గొన్న మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి..పువ్వాడ ఆజయ్ కుమార్

సీతారామ కల్యాణానికి తప్పని కరోనా… నిబంధనల మద్యే కళ్యాణం
-కేవలం మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి ,పువ్వాడ అజయ్ , అధికారులు మాత్రమే హాజరు
-ఆలయ లోపలి మండపంలోని కళ్యాణం
-భద్రాచలంలో నిశ్శబ్ద వాతావరణం
ఆకాశమంత పందిరి …భూదేవి అంత పీఠ వేసి అంగరంగ వైభవంగా ప్రతి ఏడాది జరిగే సీతారాములు కళ్యాణం కరోనా తో నిబంధలమద్యే జరుపుకోవాల్సి వచ్చింది . గత ఏడాది కూడా ఇదే విధంగా జరిపారు.సీతారాముల కల్యాణానికి భద్రాచలం పట్టణానానికి లక్షలాది మంది భక్తులు రాకతో సందడి నెలకొనేది .కాని కరోనా స్వామి వారిని సైతం వదలలేదు. మహమ్మారి కరోనా తో ప్రభుత్వం కఠినమైన నిబంధనలను పెట్టింది . గతంలో గుడి ముందు ఉన్న మిథిలా స్టేడియం లో అంత్యంత కమనీయంగా ,రమణీయంగా కళ్యాణం జరిగేది. ఆ వేడుకలు రద్దుకావడం భక్తులను నిరాశపరిచింది.

శ్రీరామ నవమి అనగానే మొదట గుర్తొచ్చేది భద్రాచలం లోని రాముని కళ్యాణం, వాటి తర్వాత వీధి వీధి నా వెలసే నవమి పందిళ్ళు.ఆ పందిళ్ళ లో దొరికే బెల్లం పానకమూ, వడపప్పూ. ఆ వైభవానికి తగ్గట్టుగా పందిట్లో పోసే ముత్యాల తలంబ్రాలు, దేనికవే సాటి. కరోనా కారణంగా ఈ ఆనందం అందరికీ దూరం కాగా…భద్రాచలంలో శ్రీ రామనవమి వేడుకలు బుధవారం నిరాడంబ‌రంగా జ‌రిగాయి. సంప్రదాయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు ,ముత్యాల తలంబ్రాలను దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి , రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లు సమర్పించారు.

వైదిక పెద్దలు, అర్చకుల సమక్షంలో స్వామివారి కళ్యాణం జ‌రిగింది దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, వేదపండితులు, అర్చకులు, ఆల‌య‌, ఇత‌ర శాఖ‌ల అధికారులు పరిమిత సంఖ్యలో ఈ వేడుకకు హాజ‌ర‌య్యారు.

Related posts

జులై 18న రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్… జులై 21న ఓట్ల లెక్కింపు!

Drukpadam

అమరీందర్ అభ్యంతరాలు బేఖాతరు.. పంజాబ్ పీసీసీ చీఫ్‌గా సిద్ధూ

Drukpadam

మరో ఎన్నికల నగారా…57 రాజ్య‌స‌భ సీట్ల ఎన్నిక‌కు షెడ్యూల్ విడుద‌ల‌…

Drukpadam

Leave a Comment