Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలురాజకీయ వార్తలు

టీడీపీ అధినేత చంద్రబాబుపై కర్నూలులో కేసు నమోదు…

Case filed on Chandrababu in Kurnool
టీడీపీ అధినేత చంద్రబాబుపై కర్నూలులో కేసు నమోదు…
  • చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన అడ్వొకేట్ సుబ్బయ్య
  • ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని ఫిర్యాదు
  • కర్నూలులో ఎన్440కే వైరస్ ఉందంటున్నారని ఆరోపణ
  • చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై కర్నూలులో కేసు నమోదైంది. కరోనా నేపథ్యంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ చంద్రబాబుపై న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదు చేశారు. కర్నూలులో ఎన్440కే వైరస్ ఉందంటూ చంద్రబాబు భయపెడుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు.

న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదును స్వీకరించిన కర్నూలు వన్ టౌన్ పోలీసులు, చంద్రబాబుపై 188, 505/1/బి/2, 54 సెక్షన్లు, జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద కేసు నమోదు చేశారు. అటు, చంద్రబాబు లేని వైరస్ ఉందంటూ విషప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు సైతం మండిపడుతున్నారు.

Related posts

కాంగ్రెస్ అధ్యక్ష పదవి స్వీకరించేందుకు మెత్తబడ్డ రాహుల్ గాంధీ !

Drukpadam

వివరణ పేరుతో కమ్యూనిస్టులపై షర్మిల విమర్శ … తమ్మినేని క్లాస్!

Drukpadam

అడ్రస్ లేని లవంగం గాళ్లంతా మాట్లాడుతున్నారని కేటీఆర్ ఫైర్ !

Drukpadam

Leave a Comment