Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

కరోనాతో ఆసుపత్రిపాలైన బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య

కరోనాతో ఆసుపత్రిపాలైన బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య

  • ఈ నెల 18నే భట్టాచార్యకు కరోనా పాజిటివ్
  • తొలుత ఆసుపత్రిలో చేరేందుకు నిరాకరణ
  • ఆక్సిజన్ స్థాయులు 90 కంటే దిగువకు
  • కోల్ కతాలోని ఓ ఆసుపత్రికి తరలింపు

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య (77) కరోనా సోకడంతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ నెల 18నే ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆసుపత్రిలో చేరేందుకు భట్టాచార్య అంగీకరించలేదు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కుటుంబ సభ్యులు కోల్ కతాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదయం ఆయన ఆక్సిజన్ స్థాయులు 90 శాతం కంటే దిగువకు పడిపోవడంతో వారు ఆందోళనకు గురయ్యారు. బుద్ధదేవ్ భట్టాచార్య ఇప్పటికే క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ)తో బాధపడుతున్నారు.

కాగా, భట్టాచార్య అర్ధాంగి మీరా కూడా కరోనా బారినపడ్డారు. ఆమె ఓ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం నిన్ననే డిశ్చార్జి అయ్యారు.

Related posts

ముక్కులో నిమ్మరసం పిండుకుంటే కరోనా రాదనుకున్నాడు… కానీ కడతేరిపోయాడు!

Drukpadam

సోనూ సూద్ ఆరోపణలపై స్పందించిన చైనా రాయబారి…

Drukpadam

చైనాలో కరోనా ఆంక్షలతో మృత్యువాత పడుతున్న చిన్నారులు…

Drukpadam

Leave a Comment