Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 24 కోట్ల కరోనా టీకా డోసుల పంపిణీ…

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 24 కోట్ల కరోనా టీకా డోసుల పంపిణీ
బుధవారం 18-44 ఏళ్ల కేటగిరీలో 19,24,924 మందికి తొలి డోసు
మరో 86,450 మందికి రెండో డోసు
ఇప్పటి వరకు 18-44 ఏళ్ల కేటగిరీలో 3,38,08,845 మందికి తొలి డోసు
4,05,114 మందికి రెండో డోసు

దేశవ్యాప్తంగా బుధవారం నాటికి 24 కోట్ల కరోనా టీకా డోసులకు పైగా పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. బుధవారం 18-44 ఏళ్ల మధ్య వయసు వారిలో 19,24,924 మందికి తొలి డోసు ఇచ్చినట్లు తెలిపింది. మరో 86,450 మందికి రెండో డోసు అందజేసినట్లు పేర్కొంది.

ఇప్పటి వరకు 18-44 ఏళ్ల కేటగిరీలో 3,38,08,845 మందికి తొలి డోసు, 4,05,114 మందికి రెండో డోసు అందజేసినట్లు ఆరోగ్య శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం 24,24,79,167 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు. వీరిలో హెల్త్‌కేర్ వర్కర్లు 1,00,12,624 మంది తొలి డోసు, 69,11,311 మంది రెండో డోసు తీసుకున్నారు. ఇక ఫ్రంట్‌లైన్ వర్కర్లలో 1,64,71,228 మంది తొలి డోసు, 87,51,277 మంది రెండో డోసు తీసుకున్నారు.

45-60 ఏళ్ల కేటగిరీలో 7,33,23,267 మంది లబ్ధిదారులు తొలి డోసు, 1,16,22,718 మంది రెండో డోసు టీకా తీసుకున్నారు. 60 ఏళ్లు పైబడిన కేటగిరీలో 6,16,38,580 మంది లబ్ధిదారులు తొలి డోసు, 1,95,34,203 లబ్ధిదారులు రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 145వ వ్యాక్సినేషన్‌ రోజు అయిన బుధవారం 31,31,759 మంది లబ్ధిదారులకు టీకా అందజేశారు. వీరిలో 28,37,572 మంది తొలి డోసు తీసుకోగా.. 2,94,187 మంది రెండో డోసు తీసుకున్నారు.

Related posts

ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ దన్ను…

Drukpadam

కేటీఆర్,సంతోష్ లకు కరోనా

Drukpadam

కరోనా డేంజర్ బెల్స్ ఇంకా ఉన్నాయి … జాగ్రత్తలు అవసరం మాస్క్ తప్పనిసరి!

Drukpadam

Leave a Comment