Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నన్ను తిట్టినన్ని తిట్లు ఎవరినీ తిట్టి ఉండరు: కేసీఆర్!

నన్ను తిట్టినన్ని తిట్లు ఎవరినీ తిట్టి ఉండరు: కేసీఆర్!
-తెలంగాణ ఉద్యమ సమయంలో నన్ను ఎన్నో విధాలుగా అవహేళన చేశారు
-ఎవరేమనుకున్నా ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించాం
-ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రభుత్వ పథకాలను అమలు చేస్తాం
-కౌశిక్ రెడ్డి పార్టీ లో చేరిన సందర్భంగా కేసీఆర్ ఆశక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ ఉద్యమ సమయంలో తనను ఎన్నో విధాలుగా అవహేళన చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తన శరీర భాగాలను కూడా కించపరుస్తూ కామెంట్లు చేశారని… అయినా తాను భయపడలేదని, వెనకడుగు వేయలేదని చెప్పారు. ఎవరేమనుకున్నా ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించామని అన్నారు.

టీఆర్ఎస్ పార్టీ అంటే మఠం కాదని… ఇదొక రాజకీయ పార్టీ అని అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే దళితబంధు పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారనే విమర్శలకు సమాధానంగా… ఎన్నికల్లో లబ్ధి కోసం కచ్చితంగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తామని చెప్పారు. ఎన్నికల్లో గెలవలేని పార్టీలే హామీలు ఇస్తుంటే… గెలిచే పార్టీ అయిన మేము ఎందుకు ఇవ్వమని అన్నారు. కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి ఈరోజు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

గ్రామాల్లో మౌలిక వసతులను కల్పించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని కేసీఆర్ విమర్శించారు. ఒకప్పుడు చెట్లను కొట్టడమే కానీ, పెట్టడం ఉండేది కాదని అన్నారు. ఇప్పుడు తెలంగాణలో పచ్చదనం పెరిగిందని, ఇన్ని చెట్లు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. హరితహారం కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోందని చెప్పారు. 12,769 గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్, ట్యాంకర్ ఉన్నాయని తెలిపారు. ప్రతిరోజు గ్రామాల్లో చెత్తను ఎత్తేస్తున్నారని చెప్పారు.

టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేసిన కేసీఆర్

కౌశిక్ రెడ్డికి గులాబీ కండువా కప్పిన కేసీఆర్
కౌశిక్ కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని హామీ
కౌశిక్ తండ్రి తన చిరకాల మిత్రుడని వ్యాఖ్య

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కౌశిక్ రెడ్డికి కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ లో చేరారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, కౌశిక్ రెడ్డి తండ్రి సాయినాథ్ రెడ్డి తనకు చిరకాల మిత్రుడని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో తనతో కలిసి సాయినాథ్ రెడ్డి పని చేశారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి కావాలనే ఆకాంక్షతోనే కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారని చెప్పారు.

ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు గెలవడం, ఓడిపోవడం అనేది ఒక నిరంతర ప్రక్రియ అని కేసీఆర్ అన్నారు. శాశ్వతంగా ఏ పార్టీ కూడా అధికారంలో ఉండదని చెప్పారు. ఎప్పుడూ అధికారంలో ఉండటానికి ఇది రాచరిక వ్యవస్థ కాదని అన్నారు. టీఆర్ఎస్ లో కౌశిక్ రెడ్డికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని కేసీఆర్ తెలిపారు. కౌశిక్ ను ఎవరూ ఆపలేరని… ఆయన ఉన్నతికి తాను హామీ ఇస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కౌశిక్ రెడ్డి బాధ్యతలను నిర్వహించిన సంగతి తెలిసిందే.

Related posts

ముహూర్తం ఫిక్స్.. 13న బీజేపీలోకి ఈటల…

Drukpadam

కేసీఆర్ ను ఉద్దేశించి ఈటల లేఖ … ఇది తప్పుడు ప్రచారం అంటున్న ఈటల మద్దతు దార్లు…

Drukpadam

ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ యస్ సిట్టింగ్ లలో ఉండేదెవరు, ఊడేదెవరు ….?

Drukpadam

Leave a Comment