Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏలూరు కార్పొరేషన్ లో పూర్తయిన ఓట్ల లెక్కింపు… 47 డివిజన్లలో ఎదురులేని వైసీపీ!

ఏలూరు కార్పొరేషన్ లో పూర్తయిన ఓట్ల లెక్కింపు… 47 డివిజన్లలో ఎదురులేని వైసీపీ
-ఏలూరు కార్పొరేషన్ వైసీపీ కైవసం
-కార్పొరేషన్ పరిధిలో మొత్తం 50 డివిజన్లు
-గతంలో 3 డివిజన్లు వైసీపీకి ఏకగ్రీవం
-ఇవాళ 47 డివిజన్లకు ఓట్ల లెక్కింపు
-44 డివిజన్లలో వైసీపీ విజయం
-3 డివిజన్లతో సరిపెట్టుకున్న టీడీపీ

ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 50 డివిజన్లు ఉండగా, 47 డివిజన్లు వైసీపీ కైవసం చేసుకుంది. మిగిలిన 3 డివిజన్లు టీడీపీకి దక్కాయి. గతంలో 3 డివిజన్లు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 47 డివిజన్లకు ఎన్నికలు చేపట్టారు. ఇవాళ ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహించగా, 44 డివిజన్లలో వైసీపీ విజయభేరి మోగించింది.

ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక్క డివిజన్ లోనూ గెలుపు దక్కలేదు. అధికార వైసీపీ ధాటికి విపక్ష టీడీపీ సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. ఏలూరు కార్పొరేషన్ ఫలితాల ద్వారా స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఆధిపత్యం మరోమారు స్పష్టమైంది.

బీజేపీ ,జనసేన , వామపక్షలకు ఒక్క డివిజన్ కూడా దక్కలేదు. మిగతా కార్పొరేషన్ లతోపాటు ఏలూరు ఎన్నకలు కూడా జరిగాయి. దీనిపై కోర్టు కు వెళ్లడంతో కోర్టు ఎన్నికల ఓట్ల లెక్కింపు పై స్టే విదంచింది. ఇటీవలనే స్టే తొలగించిన హైకోర్టు ఎన్నికల ఓట్ల లెక్కింపుతోపాటు , ఫలితాలు వెల్లడించవచ్చునని చెప్పింది.దీంతో ఆదివారం ఓట్ల లెక్కింపు నిర్వహించారు.మొత్తం 50 డివిజన్లలు గాను 47 డివిజన్లలో వైకాపా విజయకేతనం వేగరవేసింది. దీంతో వైసిపి శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.

Related posts

పొత్తుల్లో తేడా వస్తే …బలమున్న చోట లెఫ్ట్ పార్టీలు పోటీ …కూనంనేని

Drukpadam

అవసరమైతే మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తా: ఉద్ధవ్ థాకరే…

Drukpadam

కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం…ఎంపీ నామ నాగేశ్వరరావు!

Drukpadam

Leave a Comment