Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మోదీతో భేటీ అయిన మమతా బెనర్జీ!

మోదీతో భేటీ అయిన మమతా బెనర్జీ
-ఐదు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న మమత
-అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలి సారి ఢిల్లీకి రాక
-రేపు సోనియాతో భేటీకానున్న దీదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని అధికార నివాసానికి వెళ్లి ఆమె సమావేశమయ్యారు. భేటీ సందర్భంగా పలు విషయాలపై వారు చర్చించుకున్నారు. కాసేపటి క్రితం ప్రధాని నివాసం నుంచి ఆమె వెళ్లిపోయారు. భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఆమె ఢిల్లీకి రావడం ఇదే తొలిసారి. ఢిల్లీలో ఐదు రోజుల పాటు ఆమె పర్యటించనున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో రేపు మమత భేటీ కానున్నారు. టీఎంసీ ఎంపీలతో కూడా రేపు ఆమె సమావేశం కానున్నారు.

ప్రధాని మోడీతో సమావేశం కొద్దీ సేపట్లోనే ముగిసినట్లు తెలిసింది.వారు ఏ ఏ విషయాలపై మాట్లుడు కున్నారనేది పీఎంఓ లేదా మతమా చెబితేగానే తెలియదు ….

Related posts

ప‌రిటాల ర‌వి మాదిరే న‌న్నూ చంపేస్తారేమో: ఆదినారాయ‌ణరెడ్డి!

Drukpadam

ఏపీలో జిల్లాల‌కు ఇంచార్జీ మంత్రులు వీరే!

Drukpadam

ఈటలపై ఈగవాలితే చూస్తూ ఉరుకోము …కేసీఆర్ జాగ్రత్త :కిషన్ రెడ్డి హెచ్చరిక

Drukpadam

Leave a Comment