Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

దేశం లో డిజిటల్ కరన్సీ ప్రారంభించిన ప్రధాని మోడీ…

దేశం లో డిజిటల్ కరన్సీ ప్రారంభించిన ప్రధాని మోడీ
-దేశంలో ఇక నగదు రహిత ఈ-రూపీ విధానం
-దేశంలో సరికొత్త చెల్లింపుల విధానం
-ఈ-రూపీ విధానం తీసుకువచ్చిన కేంద్రం
-కాంటాక్ట్ లెస్ చెల్లింపులకు ఉపయుక్తం
-8 బ్యాంకుల ద్వారా సేవలు

నగదు రహిత చెల్లింపుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకువచ్చింది. దేశంలో నగదు రహిత ఈ-రూపీ విధానాన్ని నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. నగదు రహిత, కాంటాక్ట్ లెస్ ఆర్థిక లావాదేవీల కోసం ఈ-రూపీ విధానానికి రూపకల్పన చేశారు. ఇవాళ్టి నుంచి ప్రజలకు ఈ-రూపీ విధానం అందుబాటులోకి వస్తోంది.

ఈ విధానంలో చెల్లింపులు ఎలా ఉంటాయంటే… మొబైల్ ఫోన్ కు ఈ-రూపీ క్యూఆర్ కోడ్, ఎస్సెమ్మెస్ స్ట్రింగ్ ఓచర్ వస్తాయి. ఈ రెండింటి సాయంతో చెల్లింపులు జరపవచ్చని, ఇది ఎంతో సురక్షితమైన విధానం అని కేంద్రం వెల్లడించింది. ఇంటర్నెంట్ బ్యాంకింగ్, కార్డులు, యాప్ లతో సంబంధం లేకుండా లావాదేవీలు జరపవచ్చని వివరించింది. ప్రస్తుతం 8 బ్యాంకుల ద్వారా ఈ-రూపీ సేవలు అందించనున్నారు.

Related posts

512 కేజీల ఉల్లిపాయలు అమ్మితే రైతుకు మిగిలింది రూ 2 లే…!

Drukpadam

ఉద్యోగుల రిటైర్ మెంట్ వయస్సు పెంపుపై ఆగ్రహం

Drukpadam

ముఖేశ్ అంబానీ, ఆయ‌న ఫ్యామిలీకి భ‌ద్ర‌త కొన‌సాగించాల్సిందే: సుప్రీంకోర్టు!

Drukpadam

Leave a Comment