Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఇది హిందువులు, బీజేపీ కార్యకర్తలు, ప్రొద్దుటూరు ప్రజలు సాధించిన విజయం: సోము వీర్రాజు

ఇది హిందువులు, బీజేపీ కార్యకర్తలు, ప్రొద్దుటూరు ప్రజలు సాధించిన విజయం: సోము వీర్రాజు
-ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయవద్దని కలెక్టర్ ఆదేశించారు
-ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
-రాజకీయ లబ్ధి పొందాలనుకున్న ఎమ్మెల్యే రాచమల్లు కుట్రలు భగ్నమయ్యాయి

కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయవద్దని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకున్న స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుట్రలను భగ్నం చేస్తూ బీజేపీ చేసిన పోరాటాల ఫలితంగా అక్కడ విగ్రహం ఏర్పాటు చేయకూడదని జిల్లా కలెక్టర్ ఆదేశించారని వీర్రాజు పేర్కొన్నారు.

ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలను తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారని తెలిపారు. ఇది, హిందువులు, బీజేపీ కార్యకర్తలు, ముఖ్యంగా ప్రొద్దుటూరు ప్రజలు సాధించిన గొప్ప విజయమని వీర్రాజు అన్నారు. దీనిపై గత కొన్ని రోజులుగా వివాదం రాజుకుంటున్న సంగతి తెలిసిందే . అక్కడ టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే పూనుకున్నారని ఆయన విగ్రహం ఏర్పాటును వ్యతిరేకిస్తూ బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఉన్నాయి. అప్రమత్తమైన ప్రభుత్వం ఎలాంటి విగ్రహాలు ఏర్పాటు చేయవద్దని ఆదేశాలు జారీచేసింది. అక్కడ కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక ఉత్తర్వు విడుదల చేశారు.

Related posts

పులి కడుపున పులే పుడుతుంది.. మీ బిడ్డగా సేవ చేస్తా: పాలేరులో షర్మిల…

Drukpadam

రాష్ట్రంలో ప్రజలు వరదలతో అల్లాడుతుంటే సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు యాత్రలా …సిగ్గుచేటు …సీఎల్పీ నేత భట్టి…

Ram Narayana

కేసీఆర్ డైరెక్షన్ లోనే మొత్తం డ్రామా జరిగింది: షబ్బీర్ అలీ

Drukpadam

Leave a Comment