Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తిరుమల లడ్డుకి 306 సంవత్సరాలు చరిత్ర ….

తిరుమల లడ్డు 306 సంవత్సరాలు చరిత్ర ….
-1715 ఆగస్టు 2 నుంచి లడ్డులు ప్రారంభం
-తిరుపతి లాడ్డుకి విశిష్టమైన చరిత్ర పేటెంట్ హక్కులు కలిగి ఉన్న లడ్డు
-తిరుపతి వచ్చిన వారు లడ్డు లేకుండా వెళ్లారు
-దానికోసం పెద్ద పెద్ద క్యూలైన్లు …అదనపు లడ్డులా కోసం ఆరాటం
-రుచిలోనూ సాటిలేని తిరుపతి లడ్డు

తిరుమలశ్రీవారిలడ్డూకు 306వ పుట్టి ఇప్పటికి కి సరిగ్గా 306 సంవత్సరాలు …. 1715 ఆగస్టు 2 నుంచి తిరుపతి లో లడ్డు పంపిణి ప్రారంభం అయింది. నాటి నుంచి నేటి వరకు రుచిలో తిరుగులేదు . తిరుపతి లాడ్డుకి పేటెంట్ హక్కులు కలిగి ఉండటం మరో విశిష్టత . దేశ విదేశాలనుంచి వచ్చే భక్తులు లడ్డులు లేకుండ వెళ్లటం జరగదు అంతే ఆశ్చర్య పోనవసరం లేదు.

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం భక్తులకు పరమపవిత్రం, స్వామి వారి లడ్డూ కోసం భక్తులు ఎగబడుతుంటారు, తిరుమలకు వెళ్లిన క్రమంలో ఇంకా కొన్ని లడ్డూలు దొరికితే బాగుండు అనుకునే భక్తులు చాలామందే ఉంటారు. స్వామివారి లడ్డూ ప్రసాదం లేకపోతే తిరుమల తిరుపతి తీర్థయాత్ర చేసినట్టే కాదని మరికొందరు భావిస్తారు.

చక్కెర, శనగపిండి, నెయ్యి, ఆయిల్, యాలకులు, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్‌తో చేసే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే ఇష్టపడని భక్తులు ఉండరంటే అతిశయోక్తి కాదు. రకరకాలైన ప్రసాదాలను టీటీడీ అందుబాటులో ఉంచినప్పటికీ భక్తులకు లడ్డూ అంటేనే అత్యంత ప్రీతిపాత్రంగా ఉంటుంది. ప్రసాదాల విక్రయం ద్వారా టీటీడీకి ఏటా కోట్ల ఆదాయం సమకూరుతోంది. శ్రీవారి ప్రసాదంగా లడ్డూను ఇవ్వడం 1715 ఆగస్టులో ప్రారంభమైందని అంటారు…

శ్రీవారి లడ్డూకు జీఐఎస్ రోజుకు మూడు లక్షలకు పైగా లడ్డూలు తయారు చేయగల సామర్థ్యం టీటీడీ సొంతం, బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు మరింత ఎక్కువగా లడ్డూలను అందుబాటులో ఉంచుతారు టీటీడీ అధికారులు, నిత్యం వందలాది మంది లడ్డూ ప్రసాదం తయారీలో నిమగ్నమై ఉంటారు, తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం వినియోగించే కిచెన్‌ను ఆధునిక హంగులు ఏర్పాటు చేశారు, బూందీ క్రేట్స్‌తో పాటు లడ్డూలను మోసుకుపోయేందుకు ఎస్కలేటర్లను కూడా ఏర్పాటు చేశారు, తిరుపతి లడ్డూకు పేటేంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉండటం విశేషం, అంతేకాదు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ కార్యాలయం రిజిస్ట్రార్ 2014వ సంవత్సరంలో ‘జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్’ కూడా ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం 306 సంవత్సరాల కిందటే మొదలైందని, స్వామి వారి లడ్డు పుట్టినరోజు 1715, ఆగస్టు 2 అని, ఆ క్రమంలో ఇవాళ 306వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందని, దాంతో శ్రీవారి లడ్డూకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు తిరుమల భక్తులు…

Related posts

చరిత్రను తిరగరాయలేం.. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో పరిష్కరించుకోవాలి: సద్గురు జగ్గీ వాసుదేవ్!

Drukpadam

దేశద్రోహం చట్టంపై మరో పిటిషన్… పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం

Drukpadam

ఏపీ రాజధాని అమరావతే: రాజ్యసభలో వెల్లడించిన కేంద్రం

Ram Narayana

Leave a Comment