Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అమర్ రాజా బ్యాటరీ సంస్థ విషయంలో ,సజ్జల ,బొత్స విరుద్ధమైన మాటలు!

అమర్ రాజా బ్యాటరీ సంస్థ విషయంలో ,సజ్జల ,బొత్స విరుద్ధమైన మాటలు!
-సలహాదారు తరలి పోవాల్సిందే అంటే మంత్రి బొత్స మాత్రం లేదు లేదు అంటున్నారు.
-‘అమరరాజా ఫ్యాక్టరీ’ వల్ల ఆ ప్రాంతమంతా విషతుల్యం అవుతోంది..
-మేమే వెళ్లిపొమ్మన్నాం: సజ్జల స్పందన
-అమరరాజా కంపెనీతో ప్రజల ప్రాణాలకు ముప్పు
-వారు వెళ్లిపోవడం కాదు, మేమే పొమ్మన్నాం
-కంపెనీ ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదన్న అటవీశాఖ ముఖ్యకార్యదర్శి
-వెళ్లిపోవాలని మేం కోరుకోవడం లేదన్న మంత్రి బొత్స

తిరుపతి లో ఉన్న అమర్ రాజా బ్యాటరీ సంస్థ వల్ల విషతుల్యం అవుతుందని దానివల్ల ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దాన్ని తక్షణమే తరలించాలని ప్రభుత్వమే కోరిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి చెబుతుండగా ,సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం లేదు లేదు తాము ఆ సంస్థ తరలి పోవాలని కోరుకోవడం లేదని అన్నారు. ప్రభుత్వం నుంచే రెండుఅంటాలు రావడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు అర్థం అవుతుంది.

చిత్తూరు జిల్లా తిరుపతిలోని అమరరాజా బ్యాటరీస్ తమిళనాడుకు తరలిపోనుందన్న వార్తలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయమై స్పందిస్తూ .. ఆ సంస్థ వెళ్లిపోవడం కాదని, తామే పంపేస్తున్నామని చెప్పుకొచ్చారు. అమరరాజా ఫ్యాక్టరీ వల్ల ఆ ప్రాంతమంతా విషతుల్యం అవుతోందని, అక్కడి నీళ్లలో ప్రాణాలకు హాని కలిగించే విష పదార్థాలు ఉన్నాయని కాలుష్య నియంత్రణ మండలి కూడా చెప్పిందని పేర్కొన్నారు.

కాబట్టి వాళ్లు పోవడం కాదని, ప్రభుత్వమే పొమ్మని చెబుతోందని తెలిపారు. ఈ విషయంలో రాజకీయం కానీ, ప్రభుత్వ జోక్యం కానీ ఏమీ లేదన్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించని పరిశ్రమలను మాత్రమే ఆహ్వానిస్తామని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్ ఇదే కోరుకున్నారని సజ్జల అన్నారు. ఫ్యాక్టరీ సుబ్బారెడ్డిదైనా, ఎల్లారెడ్డిదైనా, చివరికి సజ్జల రామకృష్ణారెడ్డిదైనా జగన్ ఇలాంటి నిర్ణయమే తీసుకుంటారని అన్నారు. ఇంకా చాలామందిపై కేసులు ఉంటాయని సజ్జల హెచ్చరించారు.

అటవీశాఖ ముఖ్యకార్యదర్శి విజయ్‌కుమార్ కూడా ఇలానే స్పందించారు. అమరరాజా ఫ్యాక్టరీ ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదని అన్నారు. పర్యావరణ నిబంధనలు పాటించకపోవడంతోనే అమరరాజా బ్యాటరీస్‌ను మూసేయమని ఉత్తర్వులు జారీ చేసినట్టు చెప్పారు. తొలుత లోపాలు సరిచేసుకునేందుకు సమయం ఇచ్చామని, ఆ తర్వాత ఉత్పత్తిని నిలిపేయాలంటూ ఉత్తర్వులు ఇచ్చినట్టు చెప్పారు. అయినప్పటికీ లోపాలు సరిచేసుకోకపోవడంతో మూసివేత ఉత్తర్వులు ఇచ్చి, విద్యుత్ సరఫరా నిలిపివేశామని వివరించారు. హైకోర్టు ఆదేశాలతో తనిఖీల కోసం వెళ్లిన అధికారులను గేట్లు మూసి అడ్డుకున్నారని, దీనిపై కేసు నమోదైందని అన్నారు.

అమరరాజా వ్యవహారంపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. సంస్థ మరో రాష్ట్రానికి వెళ్లిపోవాలని తాము అనుకోవడం లేదని, కానీ లాభం ఎక్కడ ఉంటే, వ్యాపారులు అక్కడకు వెళ్తారని అన్నారు. వ్యాపారం చేసుకునే వారికి ఏ రాష్ట్రమైతే ఏంటని ప్రశ్నించారు. అమరరాజాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడీ లేదని మంత్రి పేర్కొన్నారు.

Related posts

ఎన్నికలు అపహాస్యమవుతుంటే చర్యలు తీసుకోకపోవడం దారుణం: చంద్రబాబు!

Drukpadam

వ‌య‌నాడ్‌లోని రాహుల్ గాంధీ కార్యాల‌యంపై దుండగుల దాడి… 

Drukpadam

పాల్వంచలో స్వల్ప భూకంపం… పరుగులు తీసిన ప్రజలు!

Drukpadam

Leave a Comment