Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

జగన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ టీవీ 5 కార్యాలయంపై రాయితో దాడి…

జగన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ టీవీ 5 కార్యాలయంపై రాయితో దాడి…
-కర్నూలు జిల్లా వాసి అరెస్ట్
-కార్యాలయానికి వచ్చిన ఓ వైద్యుడి కారు అద్దం కూడా డేమేజ్
-పట్టుకుని పోలీసులకు అప్పగింత
-నిందితుడిది కర్నూలు జిల్లా పెద్దలపురం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి ఒకరు టీవీ5 కార్యాలయంపై రాయితో దాడి చేశాడు. ఈ ఘటనలో కార్యాలయ అద్దం దెబ్బతినడంతోపాటు ఓ వైద్యుడి కారు అద్దాలు పగిలిపోయాయి.

జిల్లాలోని బండి ఆత్మకూరు మండలం పెద్దలపురానికి చెందిన తేజేశ్వర్‌రెడ్డి (37) నిన్న హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్ 1లో ఉన్న టీవీ 5 కార్యాలయానికి చేరుకున్నాడు. అనంతరం కార్యాలయం అద్దాలపై రాయితో దాడిచేశాడు. ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు టీవీ 5 కార్యాలయానికి వచ్చిన వైద్యుడు శ్రీధర్‌రెడ్డి కారుపై ఆ రాయి పడడంతో దాని అద్దం పగిలింది. అప్రమత్తమైన టీవీ 5 సిబ్బంది నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు మద్యం తాగి ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. జగన్‌పైనా, ఆయన పార్టీపైనా తప్పుడు ప్రచారం చేస్తున్నందుకే దాడికి పాల్పడినట్టు విచారణలో అతను తెలిపాడు.

Related posts

పాక్ మసీదులో ఉగ్రదాడి ఘటనలో 83కు పెరిగిన మృతుల సంఖ్య!

Drukpadam

పక్కింటోళ్లపై పగబట్టిన మహిళ… 35 పావురాలపై విషప్రయోగం!

Drukpadam

ఏపీ లో పోలీసులకు సవాల్ గా మారిన చడ్డీగ్యాంగ్ దోపిడీలు ….

Drukpadam

Leave a Comment