Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ముగిసిన టోక్యో ఒలింపిక్ క్రీడలు… అమెరికాకు అగ్రస్థానం!

ముగిసిన టోక్యో ఒలింపిక్ క్రీడలు… అమెరికాకు అగ్రస్థానం!
-గోల్డ్ మెడల్స్ కోసం అమెరికా ,చైనా హోరాహోరీ
-గోల్డ్ లో అమెరికా కు 39 ,చైనాకు 38 పథకాలు
-జులై 23న ప్రారంభమైన ఒలింపిక్స్
-ఆగస్టు 8తో ముగింపు
-అందరినీ అలరించిన క్రీడోత్సవం
-భారత్ కు 48వ స్థానం

ప్రపంచాన్ని వణికించిన కరోనా నేపథ్యంలో అసలు ఒలంపిక్స్ క్రీడలు జరుగుతాయా లేదా ? అనే సందేహాల మధ్య జపాన్ రాజధాని టోక్యో నగరం అత్యంత అద్భుతంగా క్రీడలను నిర్వహించింది. ప్రపంచంలోని వివిధ దేశాలను చెందిన క్రీడాకారులకు సౌకర్యాలు కల్పించటంతో పాటు వారికీ ఏ లోటు లేకుండా చూసి ప్రసంశలు అందుకుంది. పథకాల పట్టికలో పసిడి కోసమా జరిగిన పోరులో అమెరికా చైనా హోరాహోరీగా తలపడ్డాయి. మొదటి నుంచి గోల్డ్ మెడల్స్ లో అగ్రస్థానంలో ఉన్న చైనా చివరిలో వెనకబడి అమెరికా అగ్రస్థానంలోకి వచ్చింది కేవలం ఒక్క పసిడి ఎక్కువ గెలిచిన అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. అమెరికాకు పసిడి 39 రాగ , చైనాకు 38 వచ్చాయి.

పక్షం రోజుల పాటు ప్రపంచ క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన టోక్యో ఒలింపిక్స్ ముగిశాయి. జపాన్ రాజధాని టోక్యోలో కొద్దిసేపటి కింద ఒలింపిక్స్ ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. గత నెల 23న ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కాగా, కరోనా సంక్షోభ సమయంలోనూ జపాన్ ప్రభుత్వం ఎంతో దృఢ సంకల్పంతో క్రీడలు నిర్వహించింది. కట్టుదిట్టమైన బయో బబుల్ నిబంధనలు అమలు చేసి సజావుగా ఒలింపిక్స్ నిర్వహించి అందరి ప్రశసంలకు పాత్రురాలైంది.

కాగా, టోక్యో ఒలింపిక్స్ పతకాల పట్టికలో అమెరికా నెంబర్ వన్ గా నిలిచింది. ఆఖరి వరకు అమెరికా, చైనా మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అయితే చివర్లో అనేక క్రీడాంశాల్లో అమెరికా పసిడి పతకాలు నెగ్గి చైనాను వెనక్కి నెట్టింది.

అమెరికా 39 స్వర్ణాలు, 41 రజతాలు, 33 కాంస్యాలు సహా మొత్తం 113 పతకాలు సాధించింది. చైనా 38 పసిడి పతకాలు, 32 రజతాలు, 18 కాంస్యాలతో మొత్తం 88 పతకాలు చేజిక్కించుకుని రెండోస్థానంలో నిలిచింది. ఇక, ఆతిథ్య జపాన్ 27 స్వర్ణాలతో మూడో స్థానంలో నిలవగా, ఆ తర్వాత వరుసగా బ్రిటన్ (22 స్వర్ణాలు), రష్యా ఒలింపిక్ కమిటీ జట్టు (20 స్వర్ణాలు) టాప్-5లో నిలిచాయి.

భారత్ కు పతకాల పట్టికలో 48వ స్థానం దక్కింది. భారత్ ఖాతాలో 1 స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి.

Related posts

టీఆర్ఎస్ పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించిన హైకోర్టు!

Drukpadam

రెండు వారాల క్రితం అడవుల్లో కూలిన విమానం..సజీవంగా 11 నెలల చిన్నారి

Drukpadam

రాజీవ్ గాంధీ హంతకులకు స్వేచ్ఛను ప్రసాదించిన సుప్రీంకోర్టు!

Drukpadam

Leave a Comment