Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణలో షర్మిల పాదయాత్ర అక్టోబర్ 18 నుంచి!

తెలంగాణలో అక్టోబర్ 18 నుంచి షర్మిల పాదయాత్ర!

ముహూర్తం ఖరారు వైఎస్ ఆర్ టీపీ
చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభం
ఇప్పటికే రెండు సార్లు పాదయాత్ర చేసిన షర్మిల
రాజన్న సంక్షేమ రాజ్యమే లక్ష్యం

తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తీసుకురావడమే తన లక్ష్యమని ప్రకటించిన వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల… దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీ టీఆర్ఎస్ ను తన విమర్శలతో ఆమె ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగులను మోసం చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పదునైన విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అందులో భాగంగానే ఆమె ఒక పక్క పార్టీ నిర్మాణాన్ని చూసుకుంటూనే మరో పక్క మంగళవారం నిరుద్యోగ దీక్షలను చేపడుతున్నారు. కేసీఆర్ విధానాలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు పాదయాత్రతో ప్రజల్లో ఉండాలనే కోరికతో ఆమె అక్టోబర్ నుంచి చేపట్టబోతున్నారు.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టేందుకు ఆమె సన్నద్ధమవుతున్నారు. అక్టోబర్ 18 నుంచి పాదయాత్రను చేపట్టనున్నారు. చేవెళ్ల నుంచి ఆమె పాదయాత్ర ప్రారంభం కానుంది. ఆమె తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి చేవెళ్ల నుంచి పాదయాత్రను ప్రారంభించి… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇప్పుడు షర్మిల కూడా అదే సెంటిమెంటును కొనసాగించబోతున్నారు.

అయితే, షర్మిల పాదయాత్రను చేపట్టబోతుండటం ఇదే తొలిసారి కాదు. గతంలో తన అన్న జగన్ జైలుకు వెళ్లిన సందర్భంగా ఆమె పాదయాత్రను చేపట్టారు. 2012లో ఉమ్మడి ఏపీలో 14 జిల్లాల మీదుగా ఆమె పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో భాగంగా 3,112 కిలోమీటర్ల దూరాన్ని ఆమె నడిచారు. మరోసారి ప్రజాప్రస్థానం యాత్ర పేరుతో మరో పాదయాత్రను ఆమె చేపట్టారు. పులివెందులలో ప్రారంభమైన ఆమె యాత్ర… 2013 ఆగస్టు 4న శ్రీకాకుళంలో ముగిసింది.

Related posts

దళితబందు డబ్బు ఇస్తాం…బట్ కండిషన్స్ అప్లై…

Drukpadam

కోయంబత్తూరులో కమల్ హాసన్ ముందంజ…

Drukpadam

ఆఫ్ఘన్ భూభాగం ఉగ్రవాదుల అడ్డా కాకూడదు: భారత్!

Drukpadam

Leave a Comment