Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

విసుగు పుట్టిస్తున్న ఎంపీ రఘురామ వితండ వాదం…

విసుగు పుట్టిస్తున్న ఎంపీ రఘురామ వితండ వాదం…
నిత్యం వార్తలలో నిలుస్తున్న వ్యక్తిగా రికార్డు
-పార్టీకి తలనొప్పిగా మారిన వ్యవహారం
-ఫిరాయింపుల చట్టాన్ని సవరించి రఘురామాను అనర్హుడిగా ప్రకటించాలంటున్న వైసీపీ
-ఫిరాయింపుల చట్టంలో షెడ్యూల్-10ను నేను ఉల్లంఘించలేదు: రఘురామ
-కొనసాగుతున్న వైసీపీ, రఘురామ పోరు
-ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రఘురామ
-తమ ఎంపీలు న్యాయశాఖమంత్రిని కలిసినట్టు వ్యాఖ్య
-ఫిరాయింపు చట్టంలో సవరణలు కోరారని వివరణ
-షర్మిలకు జగన్ సగం ఆస్తిని ఇవ్వాలి కొత్త ప్రతిపాదన
వైసీపీ గెలుపులో షర్మిలకు సగం పాత్ర
పార్టీ కోసం గొప్పగా ప్రచారం చేశారు
అంబటి రాంబాబు కూడా ఎంతో కష్టపడ్డారు

నరసాపురం ఎంపీ, వైసీపీ రెబెల్ నేత రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు అంశంపై తమ ఎంపీలు న్యాయశాఖ మంత్రిని కలిశారని, ఫిరాయింపుల చట్టంలో సవరణలు చేయాలని వారు మంత్రిని కోరారని తెలిపారు. కానీ, ఫిరాయింపుల చట్టంలో షెడ్యూల్-10ను తాను ఉల్లంఘించలేదని రఘురామ స్పష్టం చేశారు. అటు, తమ ఎంపీలు హైకోర్టును కర్నూలుకు మార్చాలని కూడా మంత్రికి విన్నవించారని వివరించారు. అయితే, పార్టీ హెడ్ క్వార్టర్స్ మార్చినంత త్వరగా కోర్టును మార్చుతారా? అని రఘురామ ప్రశ్నించారు.

వైసీపీ సర్కారు తిరుమల శ్రీవారిని కూడా వదలడంలేదని విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నుంచి ఏడాదికి రూ.1.25 కోట్లు వస్తుండగా, ఇకపై సాలీనా రూ.50 కోట్లు వచ్చేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని క్యాబినెట్ లో నిర్ణయించారని వెల్లడించారు. పరిస్థితి చూస్తుంటే స్వామివారి నగలను సైతం విక్రయిస్తారేమోనన్న సందేహాలు వస్తున్నాయని తెలిపారు.

“ఈ ప్రభుత్వం ఇకనైనా మా దేవుడ్ని వదిలేయాలి. తిరుమల వెంకన్న ఆస్తుల జోలికి వెళ్లవద్దంటూ భక్తులందరం కలిసి సీఎంకు వినతి పత్రం పంపుదాం” అని రఘురామ పేర్కొన్నారు.

జగన్ ఆస్తిలో సగం వాట షర్మిలకు ఇవ్వాలి కొత్త ప్రతిపాదన

కందకు లేని దురద కత్తిపీటకు అన్నట్లు ఉంది వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ వ్యవహారం .జగన్ ,సోదరి షర్మిలకు ఆస్తిలో సగం వాట ఇవ్వాలని కొత్తప్రతిపాదన చేశారు. ఆమె రఘురామ దగ్గరకు వెళ్లి నాకు సగం వాట ఇప్పించండి. అంటే తప్పులేదు. కానీ ఆమె అడగకుండానే ఈయన ఆమె తరుపున మాట్లాడటం కందకు లేని దురద కత్తిపీటకు అన్నట్లు ఉంది…
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి టార్గెట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి రావడంలో జగన్ సోదరి షర్మిల పాత్ర కూడా ఉందని ఆయన అన్నారు. వైసీపీ గెలుపు కోసం షర్మిల ఎంతో కష్టపడ్డారని, గొప్పగా ప్రచారం చేశారని చెప్పారు. ఇప్పుడు ఆమె తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్నారని అన్నారు.

జగన్ తనకున్న ఆస్తిలో సగ భాగాన్ని షర్మిలకు ఇవ్వాలని చెప్పారు. వైసీపీ విజయంలో సగం పాత్రను పోషించిన షర్మిలకు ఆస్తిలో కూడా సగ భాగం ఇవ్వడమే న్యాయమని అన్నారు. వైసీపీ విజయంలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పాత్ర కూడా ఉందని చెప్పారు. న్యాయ శాస్త్రాన్ని అభ్యసించిన అంబటి స్వతహాగా మంచి వాగ్ధాటి కలిగిన వ్యక్తి అని అన్నారు. పార్టీలో ఆయనకు మంచి గుర్తింపు ఇవ్వాలని సూచించారు.

Related posts

ఎన్నికల సరదా  ఉంటె చంద్రబాబు కుప్పకు రాజీనామా చేసి మళ్ళీ గెలవాలి …ఎమ్మెల్యే రోజా!

Drukpadam

తెలంగాణ అభివృద్ధి సాధ్యమైనపుడు మహారాష్ట్రలో ఎందుకు కాదు?: కేసీఆర్

Drukpadam

ఒక్కరోజు ముందస్తుకు కూడా వెళ్లం: ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టీకరణ

Drukpadam

Leave a Comment