Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మద్యంలో సైనైడ్ కలిపి ముగ్గురిని హత్యచేసిన స్థానిక డాక్టర్

ఖమ్మంజిల్లా చంద్రుతండలో ఘటన

పాతకక్షలతోనే విషం కలిపినట్లు నిర్ధారణ

పోలీసుల అదుపులో నింధితుడు చిన్నా

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రుతండాలో ఉద్రిక్తత నెలకొంది. చంద్రుతండాలో బోడ భిక్షం కుమారుడు బోడ అర్జున్‌ దశదినకర్మ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరి సమీప బంధువులు బోడ హరిదాసు(60), మల్సూరు(57), భద్రు(30) మద్యం తాగి… భోజనం చేస్తూ స్పృహ కోల్పోయి మరణించారు. భోజనంలో విషం కలిపినట్లు అనుమానించి స్థానిక ఆర్ఎంపీ వైద్యుడు చిన్నా ఇంటిపై మృతుల కుటుంబసభ్యులు దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపుచేశారు. అనంతరం గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. బంధువులు తాగిన మద్యంలో సైనైడ్‌ కలిపినట్లు నిర్ధారణ అయింది. పాత కక్షలతోనే ఆర్ఎంపీ వైద్యుడు చిన్నా మద్యంలో సైనైడ్‌ కలిపినట్లు మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. చిన్నా ప్రస్తుతం ఖమ్మం పోలీస్‌ స్టేషన్‌లో పోలీసుల అదుపులో ఉన్నారు.

Related posts

దేశంలో అగ్రగామి విద్యా సంస్థలు ఇవే.. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల విడుదల!

Drukpadam

నారా లోకేశ్ లేఖ రాసినందుకే జైల్లో రాత్రి పూట రౌండ్ వేశాను: డీఐజీ రవి కిరణ్

Ram Narayana

మూడు నెలల్లో ఆరు పెళ్లిళ్లు చేసుకున్న కిలాడీ భామ!

Drukpadam

Leave a Comment