Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆఫ్ఘనిస్థాన్ నుంచి ముందుగానే భారతీయులను తరలించాల్సింది: సీతారాం ఏచూరి!

ఆఫ్ఘనిస్థాన్ నుంచి ముందుగానే భారతీయులను తరలించాల్సింది: సీతారాం ఏచూరి
-కేంద్ర ప్రభుత్వంపై సీపీఎం పార్టీ జనరల్ సెక్రటరీ విమర్శ
-స్టేట్ కమిటీ మీటింగ్ కోసం కోయంబత్తూర్ చేరిన కమ్యూనిస్టు నేత
-ఆఫ్ఘన్‌లో తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు ఏంటి?
-కేంద్రాన్ని ప్రశ్నించిన ఏచూరి
-తాలిబన్లలో మలయాళీలు ఉన్నారన్న శశిథరూర్.. వివాదాస్పదమైన ట్వీట్
-తప్పుబట్టిన బీజేపీ నేతలు

పరిస్థితి ఇంత ముదరక ముందే ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తరలించడంలో భారత ప్రభుత్వం విఫలమైందని సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి విమర్శించారు. ఆ దేశాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత, ఎయిర్‌స్పేస్ మూసేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆఫ్ఘనిస్థాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులు భయంభయంగా గడుపుతున్నారు.

ఈ నేపథ్యంలోనే సీతారాం ఏచూరి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. స్టేట్ కమిటీ సమావేశం కోసం ఆయన కోయంబత్తూర్ చేరుకున్నారు. ఈ సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారతీయులను తరలించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు వేగంగా ముందుకు సాగడం చూసిన తర్వాత చాలా దేశాలు తమ పౌరులను స్వదేశాలకు తరలించాయని ఏచూరి చెప్పారు. ‘‘దాదాపు పది, పదిహేను రోజులుగా ఆఫ్ఘనిస్థాన్‌లో కనిపిస్తున్న పరిణామాలు చూస్తే.. ఆ తర్వాత ఏం జరగబోతుందో అర్థమైపోతుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలేంటి?’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఏచూరి ప్రశ్నించారు.

అమెరికాకు భారత్ తాబేదారు దేశంగా కనిపిస్తోందని ఏచూరి విమర్శించారు. ‘‘ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సైన్యం అర్థాంతరంగా వెళ్లిపోవడం సమస్య కాదు. అసలు అమెరికా అక్కడ అడుగే పెట్టాల్సింది కాదు’’ అని ఏచూరి పేర్కొన్నారు.

తాలిబన్లలో మలయాళీలు ఉన్నారన్న శశిథరూర్.. వివాదాస్పదమైన ట్వీట్

తప్పుబట్టిన బీజేపీ నేతలు

ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు వశం చేసుకున్న తర్వాత కాబూల్ శివార్లలో ఒక ఘటన జరిగింది. అక్కడకు చేరుకున్న కొందరు తాలిబన్ ఫైటర్లలో ఒకడు తాము విజయం సాధించామనే ఆనందంలో నేలపై కూర్చొని ఆనందబాష్పాలు రాల్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.

దీన్ని చూసిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తాలిబన్లలో కనీసం ఇద్దరు మలయాళీలు ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఎందుకంటే వీడియోలో ఒకడు ‘సంసరికెట్టె’ అన్నాడని, దాన్ని మరొకడు అర్థం చేసుకున్నాడని శశిథరూర్ విశ్లేషించారు. అయితే ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వివాదాస్పదమైంది. తాలిబన్లతో మలయాళీలను ముడిపెట్టడం సరికాదని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

కేరళను తాలిబన్ ఉగ్రవాదులతో ముడిపెట్టడం సరికాదని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ఈ విషయంలో బీజేపీ నేత వినీత్ గోయెంకా కూడా స్పందించారు. ఇదేమీ కామెడీ షో కాదంటూ శశిథరూర్‌కు కౌంటర్ ఇచ్చిన ఆయన.. కేరళలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి స్యూడో సెక్యులరిజాన్ని వ్యాపింపచేస్తున్నాయని విమర్శించారు. తను ఇటీవల రాసిన ‘ఎనిమీస్ వితిన్’ పుస్తకంలో కేరళ ఎలా ఇస్లామిక్ ఉగ్రవాదుల హాట్‌స్పాట్‌గా మారుతుందనే అంశాన్ని వివరించానని చెప్పారు.

Related posts

రాహుల్ రైలు ప్రయాణం …ఢిల్లీ టు ఉదయ్ పూర్!

Drukpadam

ఇది ఎవరికీ భయపడి తీసుకున్న నిర్ణయం కాదు: మంత్రి బొత్స!

Drukpadam

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పై రాష్ట్రమంత్రి పువ్వాడ ఫైర్ …

Drukpadam

Leave a Comment