Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వెలమ, రెడ్డి, కమ్మ అని రాయరెందుకు? ఆ పదమే పెద్ద కుట్ర..ఆర్‌ఎస్ ప్రవీణ్ తీవ్ర అభ్యంతరం!

వెలమ, రెడ్డి, కమ్మ అని రాయరెందుకు? ఆ పదమే పెద్ద కుట్ర.. ఆర్‌ఎస్ ప్రవీణ్ తీవ్ర అభ్యంతరం
-అధికారులను కులం పేరుతొ కించపరచడమేంటి ?
-వాళ్లు ప్రతిభ గల భారతీయ అధికారులు
-మొసలి కన్నీళ్లు వద్దు
-మీడియాపై ఆర్‌ఎస్ ప్రవీణ్ అభ్యంతరం

ఐపీఎస్ సర్వీసును కూడా వదులుకుని బహుజన వాదంతో ప్రజల ముందుకొచ్చిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవల జరిగిన అధికారుల నియామకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా కావాలని నొక్కి చెప్పడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది అధికారుల సామర్థ్యాలను తక్కువ చేయడమేనని ,కించపరచడమేనని ఆయన మండి పడ్డారు .

హుజూరాబాద్ ఉప ఎన్నిక పుణ్యమాని దళిత కార్డు చుట్టూ తిరుగుతోంది తెలంగాణ రాజకీయం. హుజూరాబాద్ నియోజకవర్గంలోని 22 వేల దళిత కుటుంబాలని తన వైపు తిప్పుకునేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని ప్రత్యర్థులు ఘాటు విమర్శలే చేశారు. పథకాలైతే పెడతారు కానీ.. ప్రగతి భవన్‌లో ఒక్కరైనా దళిత అధికారి ఉన్నారా? సీఎంవోలోకి కనీసం ఒక్కరికి కూడా చోటెందుకు ఇవ్వలేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ సూటిగానే ప్రశ్నించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ సహా విపక్షాలు కూడా అదే విషయాన్ని లేవనెత్తాయి. ఆ వెంటనే ఆగమేఘాల మీద తెలంగాణ సర్కార్ సీనియర్ ఐఏఎస్ రాహుల్ బొజ్జాకి దళిత బంధు బాధ్యతలను అప్పగించింది. ఆ తర్వాత రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా అనిల్ కుమార్ అనూహ్య నియామకం జరిగింది.

ఇప్పటి వరకూ దళిత అధికారులకు సముచిత గౌరవం ఇవ్వలేదని విమర్శలు ఎదుర్కొన్న కేసీఆర్ సర్కార్ దిద్దుబాటు చర్యలకు దిగిందని.. అందుకే సదరు అధికారులకు కీలక పోస్టింగ్‌లు ఇచ్చారని విపక్షాలు సమర్థించుకున్నాయి. అయితే దళిత అధికారి కావడం వల్లే ఓట్ల కోసం కీలక పోస్టులు అప్పగించారంటూ మీడియా కథనాలు రాయడంపై మాజీ ఐపీఎస్, బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం ఓట్ల కోసమే
సీఎంవో, ఇంటెలిజెన్స్ వంటి కీలక పోస్టుల్లో దళిత అధికారుల నియామకం జరిగిందన్నట్లు రాయడమేంటని ఆయన ప్రశ్నించారు.

ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమితులైన అనిల్ కానీ, రాహుల్ కానీ ప్రతిభ గల భారతీయ అధికారులు అనే తెలుసని.. వారిని మరో దళితుడు అని రాసుడేంది? అని ప్రవీణ్ ఆక్షేపించారు. ఎవడన్న మాకు ఈ పదవుల బిచ్చమేస్తున్నడా? ఈ మొసలి కన్నీళ్లు ఇప్పుడైనా ఆపాలని ఆయన అన్నారు. అసలు దళిత అనే పదమే పెద్ద కుట్ర అని.. మరో వెలమ, రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ అధికారి అని రాయరెందుకు? అని ప్రవీణ్ ప్రశ్నించారు. ఇది అణగారిన వర్గాలపై కుట్ర మాత్రమే కాదని.. ఈ దేశానికి వారి సహకారాన్ని తక్కువ చేసే ప్రయత్నం కూడా అని ప్రవీణ్ తెలిపారు. ఇది అంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.

 

Related posts

బ్రిటన్ ప్రధాని పీఠం పై భారత్ సంతతి వ్యక్తి రిషిసునాక్ !

Drukpadam

జగన్ కు మంత్రి పదవుల తలనొప్పులు ….మంత్రి పదవి రానివారి అలక!

Drukpadam

సీఎం కేసీఆర్ కు అంబేద్కర్ రాజ్యాంగం పుస్తకాన్ని పంపిన షర్మిల!

Drukpadam

Leave a Comment