Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

31 న మునుగోడుకు బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా …!

31న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ… ముఖ్య అతిథిగా జేపీ నడ్డా హాజరు

  • ఇదివరకే మునుగోడు సభను ప్రకటించిన బీజేపీ
  • అమిత్ షా గానీ, జేపీ నడ్డా గానీ వస్తారంటూ ప్రచారం
  • అమిత్ షా షెడ్యూల్ సహకరించక పోవడంతో జేపీ నడ్డా రాక
  • అధికారికంగా ప్రకటించిన బీజేపీ తెలంగాణ శాఖ

మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ పార్టీలకు చెందిన తురుపు ముక్కలను ప్రయోగిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరఫున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రంగంలోకి దిగుతున్నారు. ఈ మేరకు ఈ నెల 31న మునుగోడులో బీజేపీ ఓ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్నారంటూ ఆ పార్టీ తెలంగాణ శాఖ మంగళవారం అధికారికంగా ఓ ప్రకటన చేసింది.

ఈ నెల 31న మునుగోడులో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఇదివరకే బీజేపీ నిర్ణయించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గానీ, లేదంటే జేపీ నడ్డా గానీ హాజరు కానున్నట్లు ఆ పార్టీ నేతలు ఇదివరకే వెల్లడించారు. మునుగోడు ఎన్నిక అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన నేపథ్యంలో అమిత్ షానే ఈ సభకు రప్పించే దిశగా చర్యలు చేపట్టింది. అయితే అమిత్ షా షెడ్యూల్ సహకరించని నేపథ్యంలో జేపీ నడ్డా ఈ సభకు రానున్నారు. జేపీ నడ్డా షెడ్యూల్ ఖరారు కావడంతో మంగళవారం బీజేపీ తెలంగాణ శాఖ అధికారిక ప్రకటన చేసింది.

Related posts

ఖమ్మం గుమ్మంలో బీఆర్ యస్ ప్రజా గర్జన…సభకు 5 లక్షల మంది!

Drukpadam

డబుల్ ఇంజిన్ సర్కారుకు తెలంగాణ ప్రజలు పట్టాలు వేస్తున్నారు: ప్రధాని మోదీ

Drukpadam

పార్టీ ‘భాష’నే మాట్లాడా.. 2018 నాటి ‘మోదీ’ ట్వీట్ పై ఖుష్బూ!

Drukpadam

Leave a Comment