Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

దేశంలో నకిలీ వార్తలు పెరిగిపోతున్నాయి: సీజేఐ ఎన్వీ రమణ!

దేశంలో నకిలీ వార్తలు పెరిగిపోతున్నాయి: సీజేఐ ఎన్వీ రమణ!
-సోషల్ మీడియా వార్తలకు మతం రంగు పులిమే ప్రయత్నాలు జరుగుతున్నాయి
-వార్తలకు మతం రంగు పులమడం దేశానికి మంచిది కాదు
-న్యాయమూర్తులు చెపుతున్నా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పట్టించుకోవడం లేదు
-కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలపాలని పేర్కొన్నారు

దేశంలో నకిలీ వార్తలు పెరిగిపోతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ లో కరోనా కేసులు పెరగడానికి తబ్లిగీ జమాతే సమావేశాలే కారణమంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడుతూ, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు మతం రంగు పులిమే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇది దేశానికి మంచిది కాదని అన్నారు. మతానికి కరోనా కు లింక్ పెట్టడంపై సిజెఐ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోసిల్ మీడియా పై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోసిల్ మీడియా లో వస్తున్న తప్పుడు వార్తలపై చర్యలకు ఎదో ఒక వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడ్డారు. లేక పొతే ప్రజాస్వామ్యానికే ప్రమాదమన్నారు.

సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు చేసే వారిపై చర్యలు తీసుకోకపోవడంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు చెపుతున్నా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పట్టించుకోవడం లేదని అన్నారు. దేశంలో శక్తిమంతమైన వ్యక్తులు చెపితేనే పట్టించుకుంటున్నాయని జస్టిస్అ రమణ అసహనం వ్యక్తం చేశారు. వీటిపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలపాలని పేర్కొన్నారు .

Related posts

బీసీలకు పెద్దపీఠ… ఇది జగన్ రికార్డు…సజ్జల

Drukpadam

కోర్టు గదిలో పేలిపోయిన న్యాయవాది ఫోన్.. న్యాయపోరాటానికి సిద్ధం!

Drukpadam

హైదరాబాద్‌లో ఇక 45 నిమిషాలపాటు ఉచిత వై-ఫై సౌకర్యం.. ప్రారంభించిన కేటీఆర్!

Drukpadam

Leave a Comment