Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

న్యాయవాదులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది:మంత్రి పువ్వాడ!

న్యాయవాదులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది:మంత్రి పువ్వాడ
-అందుకే న్యాయ వాదుల సంక్షేమానికి 100 కోట్లు కేటాయింపు
కే-సీఆర్ అభివృద్ధి పనులకు సహకారం అందించండి
-ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
-మంత్రికి గజమాలతో సత్కరించి , వినాయకుడి బొమ్మను బహూకరించిన న్యాయవాదులు .

న్యాయవాదులకు కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు అండగా ఉంటుంది. అదే విధంగా కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిపనులు మీరు కూడా తోడ్పాటునందుంచి సహాయపడాలని జిల్లామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. జుబ్లీ క్లబ్ లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొత్త వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని ఖమ్మం జిల్లా కోర్ట్ కు చెందిన న్యాయవాదులు , జీపీలు , పీపీలు మరియు స్టీరింగ్ కమిటీ సభ్యులు గజమాల వేసి ఘనంగా శాలువాలతో సత్కరించి వినాయకుడి బొమ్మను బహుకరించారు . పూజారుల మంత్రోచ్ఛరణలతో ఘనంగా స్వాగతం పలికి మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆశీర్వదించారు . అనంతరం మంత్రి అజయ్ కుమార్ మాట్లాడుతూ … ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా సీనియర్ న్యాయవాదులను , మరియు న్యాయవాద సోదరీ , సోదరులను కలుసుకొని వీరి మధ్య గడపటం ఎంతో ఆహ్లాదకరంగా ఉందన్నారు . న్యాయవాదులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని , నేను అభ్యర్థిగా వచ్చినప్పుడు నన్ను ఎలా ఆదరించారో అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాని కూడా ఆదరించి అండగా ఉండాలని కోరారు . న్యాయవాదులు అందరూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు సహకారం అందించాలని కోరారు . ముఖ్యమంత్రి కెసిఆర్ న్యాయవాదుల అభివృద్ధికి , సంక్షేమానికి వంద కోట్లు కేటాయించడంతో పాటు ఖమ్మం జిల్లా కోర్టులు , జీపీలు , పీపీలు మరియు స్టీరింగ్ కమిటీ నియామకంలో సామాజిక న్యాయం కల్పించినందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పలువురు న్యాయవాదులు ముఖ్యమంత్రి కెసిఆర్ , మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో డి .కృష్ణారావు జి .పి , హరేందర్ రెడ్డి పసుపులేటి శ్రీనివాస్ రావు , బెల్లం ప్రతాప్ , కే . రామారావు ,టి. హైమావతి , ఎండీ. ఇర్షాద్ , అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మరియు స్టాండింగ్ కౌన్సిల్ బసవపున్నయ్య , పోట్ల శ్రీకాంత్ , జాక్ నాయకులు బిచ్చాల తిరుమలరావు మరియు బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు .

Related posts

వారానికి నాలుగు రోజులే పని.. ఆ తర్వాత బాస్ ను కూడా పట్టించుకోవక్కర్లేదు!

Drukpadam

ముగిసిన ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలు

Drukpadam

తెలంగాణ లోని వివిధ జిల్లాల్లో వాన, ఈదురుగాలుల బీభత్సం!

Drukpadam

Leave a Comment