Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హుజురాబాద్ లో కాంగ్రెస్ తరుపున కొండా సురేఖ పోటీకి సై!

హుజురాబాద్ లో కాంగ్రెస్ తరుపున కొండా సురేఖ పోటీకి సై!
-పోటీ చేస్తానంటూనే తమకుటుంబంలో మరొకరికి టికెట్ పై షరతు
-సురేఖ పోటీ వైపే మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం
-సురేఖ వరంగల్ తూర్పు టికెట్ తమ కుటుంబానికి ఇస్తేనే హుజురాబాద్ లో పోటీ
-వరంగల్ లో జరిగిన సమావేశంలో కేసీఆర్ పై నిప్పులు చెరిగిన కొండా దంపతులు
-కేసీఆర్ అసలు రంగు బయటపడ్డ తరువాతనే బయటకు వచ్చామని వెల్లడి

ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్‌లో పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. అయితే, అంతకంటే ముందు వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ మాత్రం తమ కుటుంబానికే కేటాయిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. దీనిపై కాంగ్రెస్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు పైగా కాంగ్రెస్ తరుపున హుజురాబాద్ నుంచి పోటీచేసే అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చునని ప్రకటించారు. ఇప్పటికే 11 మంది దరఖాస్తు చేసుకొన్నట్లు తెలుస్తుంది. సురేఖ అభ్యర్థీత్వాన్ని పరిశీలిస్తున్నప్పుడు దరఖాస్తులను ఎందుకు ఆహ్వానించినట్లు అనే విమర్శలు ఉన్నాయి.

హుజూరాబాద్ నుంచి సురేఖ పోటీ చేయబోతున్నారంటూ ఇటీవల వార్తలు షికారు చేశాయి. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా ఆమెనే రంగంలోకి దింపాలని ప్రయత్నిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. సురేఖ తాజా వ్యాఖ్యలతో హుజూరాబాద్ నుంచి ఆమె పోటీ స్పష్టమని తేలిపోయింది. అయితే, తాజా మెలిక నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందన్నది చర్చనీయాంశమైంది.

వరంగల్ లక్ష్మీపురంలో నిన్న నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాలో మాట్లాడిన సురేఖ.. కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఆర్ఎస్‌లో తమను పావులా వాడుకున్నారని, కేసీఆర్ అసలు రంగు తెలిసిన తర్వాతే తాము ఆ పార్టీ నుంచి బయటకు వచ్చామని అన్నారు. సురేఖ భర్త కొండా మురళీ మాట్లాడుతూ.. వరంగల్ దళితులకు కూడా దళితబంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే వరంగల్ నుంచి దళితుల్ని లారీల్లో తరలించి హుజూరాబాద్‌లో నామినేషన్ వేయిస్తామని హెచ్చరించారు.

Related posts

దళిత బంధు గొప్ప కార్యక్రమం… కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ!

Drukpadam

అక్క కోసం రంగంలోకి దిగిన చెల్లి

Drukpadam

లాలూతో కేసీఆర్ భేటీ… ఆర్జేడీ అధినేత ఆరోగ్యంపై ఆరా!

Drukpadam

Leave a Comment