Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

కరోనా డేంజర్ బెల్స్ ఇంకా ఉన్నాయి … జాగ్రత్తలు అవసరం మాస్క్ తప్పనిసరి!

కరోనా డేంజర్ బెల్స్ ఇంకా ఉన్నాయి … జాగ్రత్తలు అవసరం మాస్క్ తప్పనిసరి! :ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా!
-వచ్చే 6 నుంచి 8 వారాలు అత్యంత కీలకం
-జాగ్రత్తలు పాటిస్తేనే మనం కరోనా నుంచి బయటపడతాం
-వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలి
-మళ్లీ కరోనా కేసులు పెరిగే పరిస్థితి తీసుకురావద్దు

ప్రపంచ మానవాళిని వణికించి కోట్లాది మరణాలకు కారణమైన కరోనా మహమ్మారి ప్రమాదం ఇంకా ఉందని , మన దేశంలో సెకండ్ వేవ్ కొనసాగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ,మాస్క్ లు తప్పని సరిగా ధరించాలని , గుంపులుగా ఉండే ప్రాంతలకు వెళ్ళాక పోవడం మంచిదని వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు చేస్తున్నారు.మూడవ వేవ్ ప్రమాదం ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకుంటే మనం తేలికగానే బయటపడే అవకాశం ఉందని అంటున్నారు.

భారత్ లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికీ కరోనా కేసులు పూర్తిగా కట్టడి కాలేదు. మరోవైపు థర్డ్ వేవ్ హెచ్చరికలను కూడా వైద్య నిపుణులు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ, వచ్చే 6 నుంచి 8 వారాల పాటు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ జాగ్రత్తలు పాటిస్తేనే మనం మహమ్మారి నుంచి బయటపడి మునుపటి పరిస్థితికి వెళ్లొచ్చని చెప్పారు. మహమ్మారి ఇంకా పూర్తిగా పోలేదని అన్నారు. ముఖ్యంగా పండుగల సీజన్ లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. టీకా తీసుకున్న వారికి ఒకవేళ కరోనా సోకినా అది తేలికపాటి దశకే పరిమితమవుతుందని చెప్పారు. వ్యాక్సిన్ అనేది రోగం తీవ్రతరం కాకుండా చూస్తుందని తెలిపారు. కరోనా మహమ్మారి ప్రస్తుతం తిరోగమనంలో సాగుతోందని… ఇలాంటి సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని హెచ్చరించారు. మళ్లీ కేసుల సంఖ్య పెంచే పరిస్థితిని తీసుకురాకూడదని అన్నారు. అందరూ మాస్కులు ధరించాలని, ఎక్కువ మంది ఒకే చోట గుమికూడవద్దని సూచించారు.

Related posts

కేసీఆర్ కు అధికారంలో కొనసాగే హక్కులేదు : ఎంపీ కోమటిరెడ్డి…

Drukpadam

దేశంలో బ్లాక్ ఫంగస్ కలకలం…..

Drukpadam

హ‌రీశ్ రావు చేసిన విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టిన కిష‌న్ రెడ్డి

Drukpadam

Leave a Comment