Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీ అధికారిని అడ్డగించిన ఒడిశా ఎమ్మెల్యే.. అధికారికి మద్దతుగా నిలిచిన గిరిజనులు!

ఏపీ అధికారిని అడ్డగించిన ఒడిశా ఎమ్మెల్యే.. అధికారికి మద్దతుగా నిలిచిన గిరిజనులు!
ఆంధ్రాలో కలిసిపోయేందుకు ప‌గులు చెన్నేరు, పట్టుచెన్నేరు ప్ర‌జ‌ల ఆసక్తి
ఆ పంచాయ‌తీల‌ ప్రజలతో నిన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికారుల భేటీ
ఆ స‌మ‌యంలో అక్క‌డ‌కు వ‌చ్చిన ఒడిశాలోని పొట్టంగి ఎమ్మెల్యే
‘ఆంధ్రా గో బ్యాక్‌’ అంటూ ఎమ్మెల్యే, అనుచ‌రుల నినాదాలు
ఎమ్మెల్యేను వెళ్ల‌గొట్టిన గిరిజ‌నులు

ఆంధ్రప్రదేశ్ ,ఒడిశా రాష్ట్రాల మధ్య ఉన్న పగులు చెన్నేరు, పట్టుచెన్నేరు పంచాయతీల విషయంలో వివాదం సుప్రీం కోర్ట్ లో ఉంది. అక్కడ ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి ఆరా తీసేందుకు పార్వతీపురం ఐ టి డి ఓ పి ఓ అధికారము వెంట బెట్టుకొని అక్కడు వెళ్లారు. అయితే అక్కడకు ఆ ప్రాంతంలోని ఒడిశా రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే వచ్చి ఆంధ్రా గో బ్యాక్ అంటూ తన అనుచరులతో నినాదాలు ఇప్పించారు. అక్కడున్న గిరిజనులు వారిని అడ్డుకొని ఆంధ్రా అధికారులకు అండగా నిలవడం విశేషం …

ఆంధ్రాలో కలిసిపోయేందుకు ఆస‌క్తి చూపుతోన్న ఒడిశాలోని పగులు చెన్నేరు, పట్టుచెన్నేరు పంచాయతీల ప్రజలతో నిన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ అధికారులు సమావేశమయ్యారు. అయితే, ఆ స‌మ‌యంలో అక్క‌డ‌కు వ‌చ్చిన ఒడిశాలోని పొట్టంగి ఎమ్మెల్యే పీతం పాడి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

‘ఆంధ్రా గో బ్యాక్‌’ అంటూ ఆ ఎమ్మెల్యే, ఆయ‌న అనుచ‌రులు నినాదాలు చేశారు. దీంతో ఆంధ్ర అధికారులకు మ‌ద్ద‌తు ప‌లుకుతూ గిరిజ‌నులు ఒడిశా ఎమ్మెల్యేకు ఎదురు తిరిగారు. గిరిజ‌నుల దెబ్బ‌కు ఎమ్మెల్యేతో పాటు ఆయ‌న అనుచ‌రులు అక్క‌డి నుంచి వెళ్లిపోయారు.

ఆంధ్ర, ఒడిశా మ‌ధ్య ఉన్న‌ వివాదాస్పద కొటియా గ్రూప్‌ గ్రామాల్లోని పగులు చెన్నేరు పంచాయతీలో ఆంధ్రప్ర‌దేశ్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తోంది. వాటి పరిశీలనకు పార్వతీపురం ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాథ్‌ వెళ్లగా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గిరిజ‌నుల సమస్యలను ఆంధ్ర అధికారులు తెలుసుకున్నారు. కొటియా రెండు రాష్ట్రాల వివాదాస్పద భూభాగమని, ఈ అంశం ప్ర‌స్తుతం సుప్రీంకోర్టులో ఉంద‌ని కూర్మ‌నాథ్ తెలిపారు.

Related posts

బాలికపై చిరుత దాడి చేసిన ప్రదేశాన్ని పరిశీలించిన టీటీడీ నూతన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి

Ram Narayana

మళ్లీ ఎన్డీఎదే అధికారం: ఇండియా టీవీ – సీఎన్ఎక్స్ పోల్ సర్వే …

Ram Narayana

నడి వయసులో పదో తరగతి పరీక్షలు రాసిన ఎమ్మెల్యే!

Drukpadam

Leave a Comment