Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

దాడిలో త‌మ ఇంజినీర్లు చ‌నిపోయినందుకు పాక్ నుంచి చైనా భారీగా ప‌రిహారం డిమాండ్‌…

దాడిలో త‌మ ఇంజినీర్లు చ‌నిపోయినందుకు పాక్ నుంచి చైనా భారీగా ప‌రిహారం డిమాండ్‌…
-పాకిస్థాన్‌లోని డసు హైడ్రోపవర్ ప్రాజెక్టు సిబ్బందిపై దాడి
-13 మంది కొన్ని నెల‌ల క్రితం మృతి
-వారిలో 9 మంది చైనా ఇంజినీర్లు
-38 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని చైనా డిమాండ్

పాకిస్థాన్‌లోని డసు హైడ్రోపవర్ ప్రాజెక్టు సిబ్బందిలో 13 మంది కొన్ని నెల‌ల క్రితం ఉగ్ర‌దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. వారిలో 9 మంది చైనా ఇంజినీర్లు కూడా ఉన్నారు. దీంతో త‌మ‌కు పాకిస్థాన్‌ 38 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని చైనా డిమాండ్ చేస్తోంది.

దీనిపై పాకిస్థాన్ ప్ర‌భుత్వం ప‌లు వివ‌రాలు తెలిపింది. చైనాతో ఈ అంశంపై చ‌ర్చ‌లు జ‌రుపుతున్నామ‌ని వివ‌రించింది. దాడి జరిగినప్పటి నుంచి డసు ప్రాజెక్టు పనులు ఆగిపోయాయని పాకిస్థాన్ అధికారి షహజేబ్ ఖాన్ బంగష్ తెలిపారు. తమ ఇంజినీర్లు మరణించినందుకు ముందుగా నష్టపరిహారం చెల్లించాలని, డసు ప్రాజెక్టు పనులను పునఃప్రారంభించడానికి ముందే పాక్ ఈ ప‌రిహారం ఇవ్వాల‌ని చైనా డిమాండ్ చేస్తోంది.

డసు ప్రాజెక్టును తిరిగి ప్రారంభించ‌డంతో పాటు న‌ష్ట‌ప‌రిహారం విష‌యంలో చైనా చేస్తోన్న‌ డిమాండ్‌పై
చర్చించేందుకు వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శుల స్టీరింగ్ కమిటీ ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేసిన‌ట్లు సమాచారం. చైనా చేస్తోన్న డిమాండ్ ప‌ట్ల పాక్ సుముఖంగా లేదు. అంత‌గా న‌ష్ట‌ప‌రిహారం అడ‌గ‌డమేంట‌ని నిల‌దీస్తోంది. కాగా, డ‌సు ప్రాజెక్టు నిర్మాణం చైనా గెఝౌబా గ్రూప్ కార్పొరేషన్ ఆధ్వ‌ర్యంలో జ‌ర‌గాల్సి ఉంది.

Related posts

ఏజన్సీ ప్రాంత బి టి రోడ్ల అభివృద్ధి పై ఎస్టీ ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశం!

Drukpadam

జర్నలిస్టులను ఎప్పుడూ గౌరవిస్తాను…ఆర్మూర్ ఎమ్యెల్యే జీవన్ రెడ్డి!

Drukpadam

ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ ఎత్తివేత… సీఎం జగన్ ఆదేశాలు

Drukpadam

Leave a Comment