Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఒకే కుటుంబంలోని నలుగురి దారుణ హత్య.. 16 ఏళ్ల అమ్మాయిపై గ్యాంగ్ రేప్

  • ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో దారుణం
  • భూ తగాదాలే కారణమని బంధువుల వెల్లడి
  • పొరుగింటి అగ్ర కులం వారే చేశారని ఆరోపణ

ఒకే కుటుంబంలోని నలుగురు అత్యంత పాశవిక హత్యకు గురయ్యారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో జరిగింది. చనిపోయిన వారిలో 16 ఏళ్ల అమ్మాయి, పదేళ్ల అబ్బాయి ఉన్నారు. హత్యకు ముందు బాలికపై దుండగులు గ్యాంగ్ రేప్ కు పాల్పడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధిత కుటుంబాన్ని దళిత ఫ్యామిలీగా గుర్తించారు. పొరుగున ఉండే అగ్రకులంవారే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని చనిపోయిన వారి బంధువులు ఆరోపిస్తున్నారు.

వారు చెప్పిన దాని ప్రకారం 11 మంది అనుమానితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్యాంగ్ రేప్, హత్య కింద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఇప్పటికే అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. పదునైన ఆయుధంతో వారిపై దాడికి పాల్పడ్డారని చెప్పారు. బాధితుల ఒంటిపై అత్యంత తీవ్రమైన గాయాలున్నాయన్నారు. అమ్మాయి మృతదేహం గదిలో కనిపించిందని, మిగతా ముగ్గురి మృతదేహాలు పెరట్లో పడేశారని చెప్పారు. 2019 నుంచి ఓ అగ్రకులానికి చెందిన కుటుంబంతో భూ తగాదాలు నడుస్తున్నాయని, సెప్టెంబర్ లో ఒకసారి ఆ కుటుంబం వారు దాడికి పాల్పడ్డారని, వారే ఈ హత్యలు చేసి ఉండొచ్చని బంధువులు ఆరోపిస్తున్నారు. కేసుపై రాజీ కుదిర్చేందుకు పోలీసులు బలవంతం చేస్తున్నారని, నిందితుల ఇంటికి పోలీసులు వెళ్తున్నారని ఆరోపించారు. 

అయితే, తాజాగా ఘటనపై ప్రయాగ్ రాజ్ పోలీస్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి స్పందించారు. నలుగురి తలలపై గొడ్డలి వేటుతో హత్య చేసినట్టు తెలుస్తోందన్నారు. అంతకుముందు బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని చెప్పారు. కాగా, ఇవాళ కాంగ్రెస్ యూపీ ఇన్ చార్జి ప్రియాంక గాంధీ.. బాధిత కుటుంబాన్ని ఇవాళ పరామర్శించనున్నారు.

Related posts

ఆర్యన్ ఖాన్ కు బెయిల్ !

Drukpadam

పండగ సమయంలో చార్జీల పెంపు లేదు ..టీఎస్ ఆర్టీసీ 4,322 స్పెషల్ బస్సులు..

Drukpadam

రాదనుకున్న ఆస్తి వందేళ్ల తర్వాత ఇప్పుడు చేతికొచ్చింది.. దాని విలువిప్పుడు రూ.556 కోట్లు!

Drukpadam

Leave a Comment