Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలురాజకీయ వార్తలు

కర్ణాటకలో కలకలం …ఎమ్మెల్యేను హత్య చేస్తే కోటి…

కర్ణాటకలో కలకలం …ఎమ్మెల్యేను హత్య చేస్తే కోటి…
-బీజేపీ ఎమ్మెల్యే హత్య కు కాంగ్రెస్ నేత కుట్ర వీడియో వైరల్
-బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాథ్‌ను హత్య చేయాలని బేరం
-విషయం మన ఇద్దరి మధ్యే ఉంటుందన్న కాంగ్రెస్ నేత
-దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

ఏపీలో ముగ్గురు ఎమ్మెల్యే లను అంతం చేస్తే తన వాటాగా 50 లక్షలరూపాయలు ఇస్తానని మధిర మున్సిపాలిటీ కి చెందిన ఒక వార్డ్ కౌన్సిలర్ బహిరంగ ఆఫర్ ఇచ్చిన విషయం హాట్ టాఫిక్ గా ఉండగా కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే ను హత్య చేస్తే కోటి రూపాయలు ఇస్తానని ఒక కాంగ్రెస్ నాయకుడు అన్న వీడియో వైరల్ గా మారడం కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపింది. అసలు ఇది నిజామా కదా అనే కోణంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది.

బీజేపీ ఎమ్మెల్యేను హత్య చేస్తే కోటి రూపాయలు ఇస్తానని కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు ఓ వ్యక్తితో బేరం కుదుర్చుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాకెక్కి రాజకీయాల్లో కలకలం రేపుతోంది. కాంగ్రెస్ నాయకుడైన గోపాలకృష్ణ ఓ వ్యక్తితో మాట్లాడుతున్న ఈ వీడియోలో యలహంక బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఆర్ విశ్వనాథ్‌ను హత్య చేయాలని చెబుతుండడం స్పష్టంగా వినిపిస్తోంది.

‘‘ఆ బీజేపీ ఎమ్మెల్యే (విశ్వనాథ్)ను ఫినిష్ చేస్తే కోటి రూపాయలు ఇస్తాను. ఈ విషయం మనిద్దరి మధ్యే ఉంటుంది ఎవరికీ తెలియదు’’ అని ఆ వ్యక్తికి చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వీడియోపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ వీడియో ఎప్పటిది, ఈ ఘటన ఎప్పుడు జరిగింది అన్న దానిపై స్పష్టమైన సమాచారం లేదు.

ఈ విషయంపై కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర మాట్లాడుతూ.. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. విశ్వనాథ్ తనతో మాట్లాడినట్టు చెప్పారు. మంగళవారం రాత్రే ఈ వీడియో గురించి తనకు తెలిసిందని అన్నారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు చెప్పారు. ఎమ్మెల్యేకు భద్రత కల్పించే అంశంపై పరిశీలిస్తున్నట్టు చెప్పారు.

Related posts

ఏపీ బీజేపీకి కోర్ కమిటీని ప్రకటించిన అధిష్ఠానం…

Drukpadam

పంజాబ్​ సమస్య తీరింది.. ఇక, రాజస్థాన్​ లో దిద్దుబాటు!..

Drukpadam

ఆ రివార్డు మాకు ఇస్తారా… రాజు మృతదేహాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది ఆశ!

Drukpadam

Leave a Comment