Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సర్వదర్శనాల కోటా పెంపు: పలు కీలక నిర్ణయాలను తీసుకున్న టీటీడీ బోర్డు!

సర్వదర్శనాల కోటా పెంపు: పలు కీలక నిర్ణయాలను తీసుకున్న టీటీడీ బోర్డు!

  • ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి
  • అన్నమయ్య నడకమార్గం అభివృద్ధికి నిర్ణయం
  • శ్రీశైల ఆలయ గోపురానికి బంగారు తాపడం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్టు ఈరోజు సమావేశమై కీలక నిర్ణయాలను తీసుకుంది. టీటీడీ తీసుకున్న నిర్ణయాలను ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు.

టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలు ఇవే:

  • వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం
  • సంక్రాంతి తర్వాత సర్వదర్శనం టోకెన్ల పెంపు
  • ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి
  • భక్తుల సౌకర్యార్థం అన్నమయ్య నడకమార్గం అభివృద్ధికి నిర్ణయం
  • వర్షం కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు వద్ద కొట్టుకుపోయిన ఆలయాల పునర్నిర్మాణం
  • ఐటీ విభాగాన్ని పటిష్ఠం చేసేందుకు ఉద్యోగ నియమాకాలు
  • రూ. 2.6 కోట్లతో నూతన పరకామణి మండపంలో యంత్రాల కొనుగోలు
  • హనుమంతుడి జన్మస్థలమైన అంజనాద్రి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయం
  • నాదనీరాజనం మండపం వద్ద శాశ్వత ప్రాతిపదికన మండప నిర్మాణం
  • శ్రీశైల ఆలయ గోపురానికి బంగారు తాపడం
  • రూ. 10 కోట్లతో స్విమ్స్ లో హాస్టల్ భవనాల నిర్మాణం
  • కల్యాణకట్టలో క్షురకులకు ఇచ్చే పీస్ రేటు రూ. 11 నుంచి రూ. 15కి పెంపు
  • రూ. 3 కోట్ల వ్యయంతో వసతి గదుల్లో గీజర్ల ఏర్పాటు
  • వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన భక్తులకు ఉచితంగా దర్శనభాగ్యం కల్పించాలని నిర్ణయం.

Related posts

ఎట్టకేలకు విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్!

Drukpadam

కేసీఆర్ పై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు…

Drukpadam

వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ!

Drukpadam

Leave a Comment