Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రయోజనాల కోసమే సింగరేణి కార్మికుల సమ్మె: కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి ధ్వజం …

టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రయోజనాల కోసమే సింగరేణి కార్మికుల సమ్మె: కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి ధ్వజం …
-తెలంగాణలో కోల్ బ్లాకుల వేలం ప్రక్రియ ప్రారంభమైంది
-రాష్ట్రాలకు బొగ్గు గనులు కేటాయించలేం
-సింగరేణి కార్మికుల సమ్మె దురదృష్టకరం

సింగరేణి సమ్మె కేవలం టీఆర్ యస్ రాజకీయప్రయోజనాలకోసమే చేసింది. అంటే తప్ప కార్మికుల ప్రయోజనాలు అనేవి ఒట్టిదే. సమ్మెవల్ల సాధించింది ఏముంది. ఇప్పటికే బొగ్గుగనుల వేలం ప్రారంభమయిందిఅని కేంద్రమంత్రి ప్రహ్లదు జోషి స్పష్టం చేశారు. రాష్ట్రాలకు బొగ్గుగనుల కేటాయించాలనే ప్రతిపాదన ఏదీలేదని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి లోకసభ సాక్షిగా చెప్పారు.

తెలంగాణలో నాలుగు కోల్ బ్లాకులకు కేంద్ర ప్రభుత్వం వేలం వేయనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికులు మూడు రోజుల పాటు సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెపై పార్లమెంటులో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రయోజనాల కోసమే ఆ సమ్మె జరిగిందని ఆయన అన్నారు. వేలం ప్రక్రియ ప్రారంభమయిందని స్పష్టం చేశారు.

యూపీఏ హయాంలో బొగ్గు గనులపై సుప్రీంకోర్టు చెప్పిన అంశాలు మనందరికీ తెలుసని… గతంలో రాష్ట్రాలకు బొగ్గు గనులను కేటాయించి ఉండొచ్చని… ఇప్పుడు తాము ఆ పని చేయలేమని చెప్పారు. సింగరేణి కార్మికులు సమ్మె చేయడం దురదృష్టకరమని అన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడితే సరిపోయేదని చెప్పారు. కోల్ బ్లాకుల వేలంపాటను ఆపి వాటిని సింగరేణికి అప్పగించాలని లోక్ సభ జీరో అవర్ లో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనికి సమాధానంగా ప్రహ్లాద్ జోషి వివరణ ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ వాస్తవాల ఆధారంగా లేదని అన్నారు.

Related posts

జ‌గ్గారెడ్డి కాంగ్రెస్‌ను వీడ‌రు: భ‌ట్టి విక్ర‌మార్క‌…

Drukpadam

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆకస్మిక రాజీనామా :బీజేపీ ముఖ్యమంత్రుల్లో నాల్గవవారు!

Drukpadam

కేసీఆర్ పర్యటనల కోసం ప్ర‌త్యేక విమానాన్ని కొనుగోలు చేయనున్న‌ టీఆర్ఎస్‌…!

Drukpadam

Leave a Comment