Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ కార్మికులకు కనీస కనీస వేతనంకై కార్మికులు పోరుబాట మానవహారం!

మున్సిపల్ కార్మికులకు కనీస  వేతనంకై  కార్మికులు పోరుబాట
-మానవహారం చేసిన మున్సిపల్ కార్మికులు
-సంఘీభావం తెలిపిన అఖిల పక్ష పార్టీలు

కేసీఆర్ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కార్మిక సంఘాల జెఎసి ఆధ్వర్యంలో జరుగుతున్న రెండో రోజు శుక్రవారం నిరసన ధర్నా అనంతరం అంబెద్కర్ సెంటర్ కూడలిలో నిర్వహించిన మానవహారానికి ఖమ్మం జిల్లా అఖిల పక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం, న్యూడెమోక్రసీ,కాంగ్రెస్, బి.యస్.పి లనుండి సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గోగిన పల్లి వెంకటేశ్వర్లు మద్దతు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జనవరి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించి 11వ పీఆర్సీ, వెంటనే జి.ఓ.నెం. 60 విడుదల చేసిన ఏడు మాసాలు కావస్తున్నా నేటికి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కేటగిరీల వారిగా కనీస వేతనాలు ఇవ్వకుండా కాలయాపన చేయడం సరైన పద్ధతి కాదని వారు తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ప్రకారం కార్మికులకు వేతనాలు అమలు చేసి ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

మున్సిపల్ కార్మికులు మానవహారం

అదే విధంగా మానవహారం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ & ఔట్ సో
ర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్‌ యూనియన్ (ఐఎఫ్ టియు) రాష్ట్ర అధ్యక్షులు జి రామయ్య, సిఐటియు ఖమ్మం జిల్లా అధ్యక్షులు తుమ్మా విష్ణువర్ధన్ పాల్గొన్నారుమాట్లాడుతూ ఖమ్మం నగర పాలక సంస్థ నందు పనిచేస్తున్న ఒప్పంద కార్మికులు సంపూర్ణంగా స్వచ్చందంగా రెండవరోజు విధులు బహిష్కరించి ధర్నా మనవహారం నిర్వహించారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం నియమించిన పే కమీషన్ అనేక మందితో చర్చించి అనేక విషయాలు పరిగణలోకి తీసుకొని తమ సిఫార్సులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వటం జరిగిందన్నారు, పే కమీషన్ రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు గ్రూప్-4లో పనిచేస్తున్న వారికి రూ.19వేలుగ్రూ
ప్-3లో పనిచేస్తున్న వారికి రూ. 22900/-లు,గ్రూప్-3ఎలో పనిచేస్తున్న వారికి రూ.31వేలు సిపార్సు చేసిందని అన్నారు.పే కమీషన్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ జీతాలతో పాటు సంవత్సరానికి వెయ్యి రూపాయలు ఇంక్రిమెంట్ రూపంలో చెల్లించా లని,పర్మినెంట్ కార్మికులతో సమానంగా సెలవులు ఇయస్,ఐ పిఎఫ్ అమలు చేయాలని చెప్పిందన్నారు. అదే విధంగా పే కమీషన్ సుప్రీం కోర్టు మరియు రాష్ట్ర హైకోర్టు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలనని ఇచ్చిన తీర్పులను కూడా పరిగణలోనికి తీసుకొని తన సిఫార్సులు ఇవ్వటం జరిగిందని కమీషన్ రిపోర్టులో తెలియ
జేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా ప్రభుత్వానికి చలనం లేకుండా కాలయాపనచేయడాన్ని వారు తప్పు పట్టారు జూన్ 21నాడు విడుదల చేసిన జి.ఓ.నెం. 60లో పే కమిషన్ సిఫార్సులకు విరుద్ధంగారూ.15600/-లు,రూ. 19500/- లు, రూ.22750/-లుగా ప్రకటించటాన్ని తీవ్రంగా ఖండించారు.మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విధ విభాగాల ఉద్యోగ కార్మిక సిబ్బంది అనేక సంవత్సరాలుగా వెట్టి చాకిరీతో మగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికులకు మున్సిపల్ కార్మికులకు 11వ పీఆర్సీ విడుదల చేసి ప్రభుత్వ ఉద్యోగు లకు మాత్రమే జీతాలు పెంచారు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెంచుతామని చెప్పి ఏడు నెలలు కావస్తున్నా కాలయపన చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీ.ఓ ప్రకారం కేటగిరీల వారిగా పారిశుద్ధ్య కార్మికులకు కనీసవేతనాలు నిర్ణయించి చెల్లించాలని కోరారు. కార్పొరేషన్లో,మున్సిపాలిటీలు, పురపాలక సంఘాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగు
ణంగా పనిచేస్తున్న కార్మికులకు పని భారం తగ్గించి కార్మిక సంఖ్య పెంచాలన్నారు. ప్రభు
త్వం ప్రకటించిన 11వ పీఆర్సీ అమలు చేస్తూ గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ తో పాటు ఒకటి రెండు మున్సిపల్ కార్పొరేషన్ లలో జీతాలు పెంచారని మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరే
షన్ మున్సిపాలిటీలు, పురపాలక సంఘాలలో మాత్రం జీతాలు పెంచకపోడం విచారించ దగిన విషయమన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నసిబ్బందికి వేతనాలు పెంచి జూన్ నెల నుండి ఏరియర్స్ చెల్లించాలని లేదంటే జనవరి నెలలో నిర్వధికంగా సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఖమ్మం జిల్లా కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వై విక్రం,యర్రా శ్రీనివాస్, ఎఐటియుసీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ సీతామహాలక్ష్మి, ఐఎఫ్ టియు నాయకులు ఆవుల అశోక్,ఆడెపు రామారావు, కంకణాల శ్రీనివాస్, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు కె. నారాయణ, టి.రా
ములు, నర్సింహ, సంఘమ్మ, పుష్ప, ఐయన్ టియుసి జిల్లా కార్యదర్శి శ్రీరాములు, మున్సి
పల్ కార్మిక సంఘంనాయకులు యం.జయరాజు, వెంకటరత్నం, లాజరు, లత, ఎఐటియుసీ మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు షేక్ హుస్సేన్,బి పాపారావు, మహేష్, నా
గమణి, సిఐటియు,నాయకులు జల్లి శ్రీను, వెంకటమణ, పద్మా, సోమేశ్వరి తదితరులు‌ పాల్గొన్నారు.

Related posts

60 ఏళ్లలో తొలిసారి తగ్గిన చైనా జనాభా.. కరోనా విలయమే కారణమా?

Drukpadam

Drukpadam

దేవెగౌడకు షాక్.. రూ. 2 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు!

Drukpadam

Leave a Comment