Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ ఆ విషయం గుర్తుంచుకో.. : బండి సంజయ్ వార్నింగ్!

కేసీఆర్ ఆ విషయం గుర్తుంచుకో.. : బండి సంజయ్ వార్నింగ్!
కేంద్రంలో ఉంది బీజేపీ ప్రభుత్వం
చావుడప్పు కొట్టే రోజు తొందర్లోనే ఉంది.
పార్లమెంట్ లో ఆందోళన చేసిన ఎంపీ లు ఎందుకు తోకముడిచారు
ధాన్యం కొనుగోళ్లపై లేని సమస్యను సృష్టిస్తున్నావు

తెలంగాణలో శాంతిభద్రతల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ సృష్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమని కేసీఆర్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. బెంగాల్, తమిళనాడు సహా..‌ పక్క రాష్ట్రాలకు కేసీఆర్ గులాంగిరీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ లేని సమస్యను సృష్టిస్తున్నారన్నారు. ఒప్పందం ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తున్నామని కేంద్రమంత్రి పియూష్ గోయల్ రాజ్యసభ సాక్షిగా చెప్పారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

పార్లమెంట్‌లో ఆందోళన చేసిన టీఆర్ఎస్ ఎంపీలు తోకముడిచారెందుకు? అని ప్రశ్నించారు. బెంగాల్లో నాలుగు స్థానాల నుంచి 77సీట్లు సాధించినట్లే.. తెలంగాణలో టీఆర్ఎస్‌పై కొట్లాడుతామని చెప్పారు. టీఆర్ఎస్‌కు చావు డప్పులు కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు డిమాండ్‌‌తో ఈనెల 27న ఇందిరా పార్క్ వద్ద ఒక్క రోజు దీక్ష చేస్తామన్నారు. నిరుద్యోగులతో పాటు దీక్షలో పాల్గొంటానని బండి సంజయ్ తెలిపారు .

Related posts

ఏపీ అప్పుల ఆంధ్రప్రదేశ్ అయ్యిందన్న జీవీఎల్!

Drukpadam

సాగర్ బరిలో సానుభూతికే కేసీఆర్ మొగ్గు

Drukpadam

రిటర్నింగ్ అధికారిని తప్పించిన ఈసీ చర్యను తప్పుబట్టిన కేటీఆర్!

Drukpadam

Leave a Comment