Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీ ఎన్నిక‌ల్లో పొత్తులపై చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు!

ఏపీ ఎన్నిక‌ల్లో పొత్తులపై చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు!
గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు, పొత్తుల‌కు సంబంధం లేదు
పొత్తులపై వైసీపీ నేతలు పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారు
ఒక్కోసారి పొత్తులు పెట్టుకున్న‌ప్ప‌టికీ ఓడిపోయాం
ఏపీలో నెల‌కొన్న పరిస్థితుల‌ దృష్ట్యా అందరూ కలవాల్సి ఉంది

టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటినుంచే ఎన్నికలపై ద్రుష్టి సారించారు. 2024 జరిగే ఎన్నికల్లో పొత్తుల విషయం ప్రస్థాయిస్తూ , తమ పార్టీ పొత్తులు ఉంటేనే గెలిసిందని వైసీపీ పసలేని వాదనలు తెస్తుందని తమకు పొత్తులు ఉన్నా లేకున్నా గెలిచినా సందర్భాలు ఉన్నాయని అన్నారు. జగన్ నాయకత్వంలో ఉన్నా వైసీపీ దుర్మార్గ పాలనా పోవాలంటే అందరం కావలసిన అవసరం ఉందని చంద్రబాబు మీడియా సమావేశంలో ప్రస్తావించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని పలు గ్రామాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ పొత్తుల‌పై ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు, పొత్తుల‌కు సంబంధం లేద‌ని చెప్పుకొచ్చారు. పొత్తులపై వైసీపీ నేతలు పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నార‌ని చెప్పారు. త‌మ పార్టీ గతంలో ప‌లు పార్టీల‌తో పొత్తులు పెట్టుకుని గెలిచింద‌ని, అలాగే పొత్తులు లేకుండా కూడా గెలిచింద‌ని ఆయ‌న తెలిపారు.

ఒక్కోసారి పొత్తులు పెట్టుకున్న‌ప్ప‌టికీ ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. పొత్తులు అనేవి రాష్ట్రంలోని పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటాయని తెలిపారు. ప్ర‌స్తుతంలో ఏపీలో నెల‌కొన్న పరిస్థితుల‌ దృష్ట్యా అందరూ కలవాల్సిన అవసరం ఉందని ఆయ‌న చెప్పారు. సీఎం జ‌గన్ ఏపీని సర్వనాశనం చేశారని ఆయన అన్నారు. జగన్ విధ్వంసక పాలన పోవాలంటే ధర్మ పోరాటం చేయాల‌ని ఆయ‌న అన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Related posts

టీడీపీ కార్య‌క‌ర్త‌లు బ‌రి తెగించారు… కుప్పం ఘ‌ర్ష‌ణ‌ల‌పై స‌జ్జ‌ల ఆగ్ర‌హం

Drukpadam

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల పోస్ట్ మార్టం…

Drukpadam

అక్టోబ‌ర్ 24న తెలంగాణ‌లోకి రాహుల్ గాంధీ యాత్ర‌…

Drukpadam

Leave a Comment