Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ఝార్ఖండ్ సీఎం నివాసంలో 15 మందికి కరోనా!

ఝార్ఖండ్ సీఎం నివాసంలో 15 మందికి కరోనా!

  • పార్లమెంట్ లో కరోనా కలకలం.. 400 మంది సిబ్బందికి పాజిటివ్

  • దేశవ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తున్న కరోనా
  • ఝార్ఖండ్ సీఎం నివాసంలో 62 మందికి కరోనా పరీక్షలు
  • సొరెన్ భార్య, పిల్లలకు కరోనా
  • ఓ మోస్తరు లక్షణాలతో బాధపడుతున్న వైనం
  • హోం ఐసోలేషన్ లో చికిత్స

దేశవ్యాప్తంగా కరోనా రక్కసి మళ్లీ చెలరేగుతోంది. కొత్త కేసులు వెల్లువెత్తుతున్నాయి. ఝార్ఖండ్ లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ నివాసంలో కొవిడ్ కలకలం రేగింది. సీఎం నివాసంలో ఏకంగా 15 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హేమంత్ సొరెన్ అర్ధాంగి కల్పనా సొరెన్ తో పాటు వారి ఇద్దరి కుమారులు నితిన్, విశ్వజిత్ కు, హేమంత్ సొరెన్ బంధువు సరళా ముర్ము, ఓ అంగరక్షకుడికి కూడా కరోనా సోకింది.

నిన్న ఉదయం సీఎం అధికారిక నివాసంలో 62 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు రాంచీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వినోద్ కుమార్ వెల్లడించారు. ఈ పరీక్షల్లో హేమంత్ సొరెన్, ఆయన మీడియా సలహాదారు అభిషేక్ ప్రసాద్, సహాయకుడు సునీల్ శ్రీవాస్తవలకు కరోనా నెగెటివ్ వచ్చింది. కాగా, సీఎం నివాసంలో కరోనా పాజిటివ్ వచ్చినవారందరికీ స్వల్ప లక్షణాలు ఉన్నాయని చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. వారిని హోం ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నామని వివరించారు.

పార్లమెంట్ లో కరోనా కలకలం.. 400 మంది సిబ్బందికి పాజిటివ్

  • 200 మంది లోక్ సభ, 69 మంది రాజ్యసభ సిబ్బందికి కరోనా
  • వేరియంట్ నిర్ధారణ కోసం జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం శాంపిళ్లు
  • మరికొన్ని రోజుల్లోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
400 Parliament Staff Tested Positive For Covid

పార్లమెంటులో కరోనా కలకలం రేగింది. 400 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. పార్లమెంట్ లో మొత్తం 1,409 మంది పనిచేస్తుండగా.. జనవరి 4 నుంచి 8 మధ్య చేసిన టెస్టుల్లో ఈ కేసులు వెలుగు చూసినట్టు అధికారులు చెప్పారు. మరికొన్ని రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఒకేసారి ఇంతమంది కరోనా బారిన పడడంపై ఆందోళన నెలకొంది. పాజిటివ్ వచ్చిన సిబ్బందిలో వేరియంట్ ఏదో తెలుసుకోవడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్టు అధికారులు తెలిపారు.

కాగా, పాజిటివ్ వచ్చిన వారిలో 200 మంది లోక్ సభ సిబ్బంది కాగా.. 69 మంది రాజ్యసభ సిబ్బంది, 133 మంది అనుబంధ సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. వారితో కాంటాక్ట్ అయిన ఉన్నతాధికారులూ ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నట్టు చెబుతున్నారు.

బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీకి కరోనా

  • అభ్యర్థులు, కార్యకర్తల రక్షణపై ఈసీ దృష్టి పెట్టాలి
  • ప్రికాషనరీ డోసులు ఇవ్వాలని డిమాండ్
  • కేసులు పెరిగిపోవడంపై ఆందోళన
BJP MP Varun Gandhi tests Covid positive

బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆదివారం ఈ విషయాన్ని ట్విట్టర్ లో ఆయన స్వయంగా ప్రకటించారు. ఇన్ఫెక్షన్ తాలూకు బలమైన లక్షణాలతో బాధపడుతున్నట్టు చెప్పారు. ఐదు కీలక రాష్ట్రాల్లో ఎన్నికల తరుణంలో కరోనా కేసులు గణనీయంగా పెరిగిపోతుండడం పట్ల వరుణ్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.

యూపీ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ కార్యకర్తల రక్షణ కోసం ఈసీ చర్యలు తీసుకోవాలని వరుణ్ గాంధీ డిమాండ్ చేశారు.

‘‘కరోనా మూడో విడత, ఎన్నికల ప్రచారం మధ్యలో ఉన్నాం. ఎన్నికల అభ్యర్థులు, కార్యకర్తలకు ప్రికాషనరీగా (ముందస్తు) కరోనా టీకా డోసులను ఇచ్చే చర్యలను ఈసీ తీసుకోవాలి’’అని వరుణ్ గాంధీ కోరారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పౌరులకు టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలంటూ ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఈసీ ఇప్పటికే కోరింది.

Related posts

తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం లేదు: సీఎస్ సోమేశ్ కుమార్!

Drukpadam

‘కొవాగ్జిన్’ ను అధికారికంగా గుర్తించిన ఆస్ట్రేలియా…

Drukpadam

కృష్ణపట్నం ఆయుర్వేద మందు పంపిణీకి బ్రేక్ :శాస్త్రీయత కావాలన్నా సీఎం జగన్…

Drukpadam

Leave a Comment