Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

మహబూబాబాద్ జిల్లాలలో దారుణం …సొంత తండ్రే కాలయముడు!

మహబూబాబాద్ జిల్లాలలో దారుణం …సొంత తండ్రే కాలయముడు!
-భార్యాభర్తల మధ్య తగాదా పిల్లలను బాలి తీసుకున్నది
-ఆడుకుంటున్న అభం శుభం తెలియని పిల్లలని జలసమాధి చేసిన దుర్మార్గుడు
-ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి చంపిన సీఆర్పీఎఫ్ జవాన్.

 
కన్నతండ్రే కాలయముడు అయిన అత్యంత పాశవిక హృదయవిదారపు ఘటనమహబూబాబాద్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే ..రామ్ కుమార్ ,శిరీష భార్య భర్తలు .వీరికి ఇద్దరు పండంటి పిల్లలు ఉన్నారు.మహబూబాబాద్ సమీపంలోని గడ్డిగూడెం తండా లో నివాసం ఉంటున్నారు. రామ్ కుమార్ ముంబై లో ఉద్యోగం చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య కలహాల కుదుపుల నేపథ్యంలో అభం శుభం ఎరుగని ఇద్దరు పిల్లల ప్రాణాలు మింగేశాడు.. హాయిగా ఆడుకుంటున్న తన కొడుకు- కూతురును తీసుకెళ్లి జల సమాధి చేశాడు.. ఈ దారుణానికి పాల్పడిన ఆ కిరాతకుడు సీఆర్పీఫ్ జవాన్ కావడం గమనార్హం.ఈ దారుణ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. గడ్డిగూడెం తండాకు చెందిన రామ్ కుమార్ అనే సీఆర్పీఫ్ జవాన్ తన ఇద్దరు కన్నబిడ్డలను కడతేర్చాడు అత్యంత కిరాతకంగా వారిని వ్యవసాయబావిలో పడేసి కడ తేర్చాడు.పండుగ సెలవులు కావడంతో ఇంటివద్ద ఆడుకుంటున్న తన ఇద్దరుబిడ్డలను నమ్మించి వ్యవసాయ బావివద్దకు తీసుకెళ్లాడు.కొడుకు-కూతురు అమ్మిజాక్సన్- జానీబేస్టోను వ్యవసాయబావిలోకి నెట్టిపడేసి హత్యచేశాడు. వారికి గోరుముద్దలు తినిపించిన ఆ చేతులతోనే గోతిలోకి నెట్టేశాడు.. ఇరుగు-పొరుగు వారంతా అక్కడికి చేరుకొని పిల్లల్ని బయటకు తీసేలోపే వారు తనువు చాలించారు. కాగా పిల్లల్ని బావిలోకి తోసేసి.. రామ్ కుమార్ అక్కడినుంచి పారిపోయాడు.పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కాలయముడై ప్రాణాలు మింగేయడం ప్రతి ఒక్కరి హృదయాన్ని తల్లడిల్లిపోయేలా చేసింది.ఈ దారుణానికి పాల్పడిన తండ్రి రామ్ కుమార్ ప్రస్తుతం ముంబైలో సీఆర్పీఫ్ జవాన్ గా విధులు నిర్వహిస్తున్నాడు భార్య శిరీషతో కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి.. ఈ నేపథ్యంలో మానవ మృగంలా మారి కొడుకు బర్త్ డే కు ముందే ప్రాణాలు మింగేశాడు.. ఆ కిరాతకుడు పరారీలో ఉన్నాడు.. కన్నతల్లి గుండెలవిసేలా రోధిస్తుంది.. ఆ తండా వాసులు తల్లడిల్లిపోతున్నారు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Related posts

మధ్యప్రదేశ్ లో సీరియల్ కిల్లర్… నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డులే అతడి లక్ష్యం!

Drukpadam

మహారాష్ట్రలో ముస్లిం మత పెద్దను కాల్చి చంపిన దుండగులు!

Drukpadam

మహారాష్ట్రలో ఘోర రోడ్ ప్రమాదం ….ఎమ్మెల్యే కుమారుడితో సహా 7 గురి మృతి!

Drukpadam

Leave a Comment