Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

విజయవాడలో విషాదం.. నిన్ననే కొన్న ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి వ్యక్తి మృతి.. భార్య పరిస్థితి విషమం!

విజయవాడలో విషాదం.. నిన్ననే కొన్న ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి వ్యక్తి మృతి.. భార్య పరిస్థితి విషమం!

  • బ్యాటరీకి బెడ్రూంలో చార్జింగ్ పెట్టి నిద్ర
  • తెల్లవారుజామున భారీ శబ్దంతో పేలుడు 
  • ఇంటికి వ్యాపించిన మంటలు

విద్యుత్ బైకులు వరుసగా పేలుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఏపీలోని విజయవాడలో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. సూర్యారావుపేటలోని గులాబీపేటకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి నిన్ననే కొత్తగా ఎలక్ట్రిక్ బైక్ ను కొనుగోలు చేశాడు.

బైక్ బ్యాటరీకి రాత్రి బెడ్రూంలో చార్జింగ్ పెట్టి కుటుంబం మొత్తం నిద్రకు ఉపక్రమించింది. ఈ క్రమంలో తెల్లవారుజామున భారీ శబ్దంతో బ్యాటరీ పేలిపోయింది. ఇల్లంతా మంటలు వ్యాపించాయి. దీంతో శివకుమార్, అతడి భార్యా పిల్లలు భయంతో కేకలు వేశారు.

మంటల్లో ఇరుక్కున్న వారి కుటుంబాన్ని ఇరుగుపొరుగు వారు వచ్చి బయటకుతీశారు. తీవ్రగాయాలపాలైన వాళ్లను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో శివకుమార్ మరణించాడు. అతడి భార్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం.

 

ఎలక్ట్రిక్ వాహనం వాడుతున్నారా..? ఈ వేసవి ముగిసే వరకు తస్మాత్ జాగ్రత్త!

Electric vehicles at more risk as mercury soars

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగాను ఎలక్ట్రిక్ వాహనాల్లో (ఈవీలు) అగ్ని ప్రమాద ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లోనే ఈ ప్రమాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో వేసవి ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్న దృష్ట్యా ప్రమాద రిస్క్ ఇంకా అధికమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈవీల తయారీలో వినియోగించే బ్యాటరీలను కంపెనీలు చైనా, దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. భారత వాతావరణ పరిస్థితులకు ఇవి అనుకూలం కాదన్నది నిపుణుల అభిప్రాయం. లిథియం అయాన్ సెల్స్ అన్నవి 20 డిగ్రీల నుంచి 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య పనిచేయడానికి అనువైనవి. ఉష్ణోగ్రతలు ఇంతకు మించి పెరిగినప్పుడు సమస్యలు ఎదురవుతాయి.

ఇటీవలి ప్రమాదాలు వేడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే నమోదైన విషయాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ‘‘బయటి ఉష్ణోగ్రతలు 40-45 డిగ్రీల సెల్సియస్ ఉన్న సమయంలో లిథియం అయాన్ బ్యాటరీలోని సెల్స్ , బ్యాటరీ ప్యాక్ లలో 50-55 డిగ్రీల మధ్య ఉంటుంది. ఆ సమయంలో బ్యాటరీలోని సెల్స్ లో వేడి నియంత్రణ అదుపు తప్పుతుంది. ఇదే అగ్ని ప్రమాదానికి దారితీస్తుంది’’ అని ఈవీ నిపుణుడు రాజీవ్ తెలిపారు.

ఎటువంటి సందర్భాల్లో బ్యాటరీల్లో ప్రమాదం ఏర్పడవచ్చు, భద్రత కోసం ఏ తరహా చర్యలు, జాగ్రత్తలు అనుసరించాలన్న దానిపై వినియోగదారుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. కొన్ని కంపెనీలు వేగంగా ఈవీలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు చూస్తున్నాయని, ఈ క్రమంలో తక్కువ నాణ్యత కలిగిన బ్యాటరీలు, సెల్స్ ను కొనుగోలు చేస్తున్నట్టు నిపుణులు తెలిపారు. ఇది కూడా ప్రమాదాలకు దారితీసే అంశంగా పేర్కొంటున్నారు. భారత్ లోని వాతావరణ పరిస్థితులు, రోడ్డు కండిషన్లకు తగ్గట్టు ఈవీ బ్యాటరీలను మన దేశమే తయారు చేసుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తున్నారు.

Related posts

నిప్పుల కొలిమిలా ఢిల్లీ.. 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు…

Drukpadam

టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత!

Drukpadam

ప్రపంచంలోనే శక్తిమంతమైన బాంబును ఉక్రెయిన్ కు తరలించిన రష్యా!

Drukpadam

Leave a Comment