Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎపిలో బస్సుకు నిప్పు పెట్టిన మావోయిస్టులు

  • చింతూరు మండలం కొత్తూరు వద్ద ఘటన
  • ఒడిశా నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సు
  • ప్రయాణికులను కిందికి దింపి బస్సుకు నిప్పు పెట్టిన వైనం

అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. చింతూరు మండలం కొత్తూరు వద్ద గత రాత్రి ఓ బస్సుకు నిప్పు పెట్టారు. ఒడిశా నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సును ఆపిన మావోలు.. ప్రయాణికులను కిందికి దింపారు. అనంతరం బస్సుకు నిప్పు పెట్టారు. దండకారణ్యం బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో వారు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.

బస్సుకు నిప్పు పెట్టడం అది పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ఘటనతో జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటనతో పోలీసులు అలెర్టయ్యారు. గత కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న చింతూరు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కపడేలా చేశాయి.

Related posts

సంచలనం…వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి సుచరిత రాజీనామా!

Drukpadam

లాక్ డౌన్ సమయంలో న్యాయవాదులను అడ్డుకోవద్దు: టీఎస్ హైకోర్టు…

Drukpadam

నల్లగొండ నాలుగోవ రౌండ్ ఫలితాలలో అదే వరవడి

Drukpadam

Leave a Comment