Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సిద్ధిపేట జిల్లాలో కేఏ పాల్ పై దాడి…

  • రైతుల పరామర్శకు బయల్దేరిన కేఏ పాల్
  • సిరిసిల్ల జిల్లా వెళుతుండగా ఘటన
  • సిద్ధిపేట జిల్లాలో పాల్ ను అడ్డుకున్న ప్రజలు
  • పాల్ చెంప చెళ్లుమనిపించిన వ్యక్తి
  • దిగ్భ్రాంతికి గురైన కేఏ పాల్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ శాంతి ప్రబోధకుడు కేఏ పాల్ కు ఊహించని రీతిలో చేదు అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి ఆయన చెంప చెళ్లుమనిపించాడు. కేఏ పాల్ అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు సిరిసిల్ల జిల్లా వెళుతుండగా, సిద్ధిపేట జిల్లా జక్కాపూర్ వద్ద ఆయనను గ్రామస్తులు అడ్డుకున్నారు. వాహనం దిగి వారితో మాట్లాడుతుండగా, వారిలో ఓ వ్యక్తి కేఏ పాల్ పై దాడి చేశాడు. దాంతో పాల్ దిగ్భ్రాంతికి గురయ్యారు. డీఎస్పీ చూస్తుండగానే ఈ దాడి జరిగింది. కాగా, కేఎల్ పాల్ చెంప చెళ్లుమనిపించిన వ్యక్తిని జిల్లెల్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. 

తనపై దాడి జరిగిన నేపథ్యంలో కేఏ పాల్ పోలీసులపై మండిపడ్డారు. మీరు పోలీసులా? టీఆర్ఎస్ కార్యకర్తలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు జీతాలు కేటీఆర్ ఇస్తున్నారా? ప్రభుత్వం ఇస్తోందా? అంటూ ప్రశ్నించారు. రైతులను అటు మోదీ గానీ, ఇటు కేసీఆర్ గానీ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. రైతుల కోసమే తాను వచ్చానని, తాను వస్తానని చెబితే వచ్చి తీరతానని కేఏ పాల్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.

Related posts

రాహుల్ గాంధీకి లభించని ఊరట.. స్వయంగా హాజరు కావాల్సిందేనన్న ఝార్ఖండ్ కోర్టు…

Drukpadam

ధనవంతుల కుటుంబాలకు షాకిచ్చే నిర్ణయం తీసుకున్న యూఏఈ!

Drukpadam

సొంత ఊరికి మంచి చేయాలని భావించి… తిరిగిరాని లోకాలకు వెళ్లిన బిపిన్ రావత్!

Drukpadam

Leave a Comment