Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తీన్మార్ మల్లన్న బీజేపీకి గుడ్ బై …కొత్త పార్టీ దిశగా అడుగులు…

తీన్మార్ మల్లన్న బీజేపీకి గుడ్ బై …కొత్త పార్టీ దిశగా అడుగులు…
-త్వరలో కొత్త పార్టీ పెడుతున్నట్లు స్వయంగా ప్రకటించిన తీన్మార్ మల్లన్న
-7,200 మంది వెలమ దొరల భరతం పడతానన్న మల్లన్న
-ఆస్తులన్నీ ప్రభుత్వానికి రాసిచ్చి రాజకీయాల్లోకి వస్తానని వెల్లడి
-10 లక్షల మందితో హైదరాబాదులో సభ నిర్వహిస్తానన్న మల్లన్న

తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ పై నిత్య విమర్శకుడిగా పేరున్న తీన్మార్ మల్లన్నఅలియాస్ చింతపండు నవీన్ బీజేపీకి దాదాపు బీజేపీకి గుడ్ బై చెప్పారు . కొత్త పార్టీ పెట్టె దిశగా అడుగులు వేస్తున్నారు . ఇకపై జీవితంలో బీజేపీ కార్యాలయం గడప తొక్కబోనని ప్రకటించారు . తాను స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడరని అందువల్ల ఏపార్టీ తో సంబందం లేకుండా సొంతపార్టీ పెడతానని వెల్లడించి సంచలనం సృష్టించారు . ఆయన పెట్టబోయే పార్టీ రంగు రుచి వాసనా ఎలా ఉంటుందనే ఆశక్తికర చర్చ జరుగుతుంది. కొద్దికాలంలోనే ఆయన బీజేపీ కి దూరం కావడం బీజేపీ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

త్వరలోనే రాజకీయ పార్టీని పెడుతున్నట్టు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ప్రకటించారు. తెలంగాణను 7,200 మంది దొంగలు పట్టి పీడిస్తున్నారని… రాష్ట్ర సంపదను వీరు కొల్లగొడుతున్నారని, ఆ 7,200 మంది వెలమ దొరల భరతం పడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే మల్లన్న టీమ్ 7200 పేరుతో తాను ఉద్యమం చేస్తున్నానని అన్నారు. తాను ఏర్పాటు చేసిన ఈ టీమ్ బీజేపీ కన్నా లక్ష రెట్లు మేలని చెప్పారు. ఇకపై జీవితంలో తాను బీజేపీ కార్యాలయంలో అడుగుపెట్టబోనని స్పష్టం చేశారు.

తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని తీన్మార్ మల్లన్న అన్నారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా తమ టీమ్ భయపడదని చెప్పారు. మరో 10 రోజుల్లో ప్రజల మధ్యకు వెళ్తానని తెలిపారు. తనపై, తన కుటుంబంపై ఉన్న ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికి రాసిచ్చి, రాజకీయాల్లోకి వస్తానని అన్నారు. ఆస్తులను త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చిన వారు ఇంతవరకు ఎవరూ లేరని చెప్పారు. ఏడాదిన్నర తర్వాత హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో 10 లక్షల మందితో బహిరంగసభను నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 176 మంది చిన్నారులకు తమ టీమ్ గుండె చికిత్సలు చేయించిందని తెలిపారు.

Related posts

ఏపీ సీఎం జ‌గ‌న్‌తో ఎంపీ మార్గాని భ‌ర‌త్ తండ్రి భేటీ!..!

Drukpadam

ఏపీ బీజేపీ లో ఇంటర్నల్ వార్ …వీర్రాజుపై కన్నా లక్ష్మీనారాయణ ఫైర్!

Drukpadam

రాష్ట్రానికి మేలు చేసే పార్టీకే మా మద్దతు : వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి!

Drukpadam

Leave a Comment